JIO offer : రిలయన్స్ జియో సంస్థ తన ఎయిర్ ఫైబర్ ప్లస్ వినియోగదారుల కోసం ధన్ ధనా ధన్ ఆఫర్ను ప్రకటించింది. ఇది జియో అందిస్తున్న ప్రత్యేక ఆఫర్. ఈ ఆఫర్ ద్వారా వినియోగదారులు మూడు రెట్లు వేగంతో ఇంటర్నెట్ను వినియోగించుకునే అవకాశం కలుగుతుంది. ఈ ధన్ ధనా ధన్ ఆఫర్ కింద ఎయిర్ ఫైబర్ ప్లస్ను ఉపయోగిస్తున్న వినియోగదారులకు జియో మూడు రెట్లు ఇంటర్నెట్ స్పీడ్ను అందిస్తుంది. అంటే 60 రోజుల పాటు ప్రస్తుత వేగం కంటే మూడు రెట్లు వేగంగా ఇంటర్నెట్ పని చేస్తుందన్న మాట.
ఐపీఎల్-2024 స్పెషల్
జియో ఇస్తున్న ఈ ప్రత్యేక ఆఫర్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. ఈ నెల 22న ప్రారంభమైన ఐపీఎల్ 2024 సీజన్ను జియో సినిమాలో ఉచితంగా స్ట్రీమ్ చేయవచ్చు. అందుకే జియో సంస్థ ఐపీఎల్ మ్యాచ్లను Jio సినిమాలో చూడటానికి ఇంటర్నెట్ వేగాన్ని మూడు రెట్లు పెంచింది. జియో అందిస్తున్న ఈ ఆఫర్ను ఎయిర్ ఫైబర్ ప్లస్ ప్రస్తుత, కొత్త వినియోగదారులు కూడా ఉపయోగించుకోవచ్చు. జియో ఈ ప్లాన్కు స్పీడ్ బూస్టర్ అనే పేరు పెట్టింది. దీని వ్యాలిడిటీ 60 రోజులుగా ఉంది.
ఏ ప్లాన్కు ఎంత స్పీడ్..
తాజా ఆఫర్ ప్రకారం.. మీరు 30 ఎంబీపీఎస్ స్పీడ్ ఉన్న ప్లాన్ కొనుగోలు చేసినట్లయితే 100 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సర్వీసును పొందుతారు. ఒకవేళ 100 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ ఉన్న ప్లాన్ తీసుకుని ఉంటే 300 ఎంబీపీఎస్ స్పీడ్ను పొందుతారు. 300 ఎంబీపీఎస్ ప్లాన్ కొనుగోలు చేసినట్లయితే 500 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సర్వీసులు పొందుతారు. 500 ఎంబీపీఎస్ స్పీడ్ అందించే ఎయిర్ ఫైబర్ ప్లస్ ప్లాన్ కొనుగోలు చేసిన వినియోగదారులకు 1 జీబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సౌకర్యం లభిస్తుంది.
జియోఫైబర్ వినియోగదారులు తమ ప్లాన్ను రీఛార్జ్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా బూస్టర్ స్పీడ్కు అప్గ్రేడ్ అవుతారు. ఇప్పటికే ఈ ప్లాన్ను ఉపయోగిస్తున్న వినియోగదారులు ఎస్ఎంఎస్, మెయిల్ ద్వారా జియో నుంచి కన్ఫర్మేషన్ పొందుతారు. దీనిలో బూస్టర్ స్పీడ్ అప్గ్రేడ్ గురించి వారికి తెలుస్తుంది. అయితే జియో ఎయిర్ ఫైబర్ ప్లస్ అందిస్తున్న ఆరు నెలలు, 12 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి మాత్రమే ఈ ప్రయోజనం లభిస్తుంది. కాగా, జియో త్వరలో పేమెంట్స్ రంగంలోకి కూడా దిగనుంది. దాంతో ఫోన్ పే, పేటీఎంలకు మరో గట్టి ప్రత్యర్థి ఎదురుకాబోతున్నట్టే.
ముఖ్యంగా పేమెంట్ సౌండ్ బాక్స్ విభాగంలో పేటీఎం ముందంజలో ఉంది. కానీ ఆ సంస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇబ్బందులను జియో తనకు అవకాశంగా మార్చుకుంటోంది. డిజిటల్ చెల్లింపుల విభాగంలోకి స్మార్ట్ స్పీకర్తో రానున్నట్లు గూగుల్ పేమెంట్స్ సర్వీస్ గూగుల్ పే ఇప్పటికే ప్రకటించింది. భారత్ పే కూడా ఈ విభాగంలోకి రావడానికి పని చేస్తోంది.