Nalgonda | జనంతో మమేకమై గెలుపు సాధించాలంటు సూచన విధాత : రానున్న శాసనసభ ఎన్నికల్లో బీఆరెస్ అభ్యర్థులుగా ఖరారైన ఉమ్మడి నల్లగొండకు జిల్లాకు చెందిన 12మంది సిటింగ్ ఎమ్మెల్యేలు అంతా మంగళవారర మంత్రి జి.జగదీశ్రెడ్డి ఆధ్వర్యంలో ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తమ అభ్యర్ధిత్వాలను ప్రకటించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ జిల్లాలో ప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీ బలాబలాలపై ఆరా తీశారు. అభ్యర్ధులంతా ఇప్పటి నుండే నిత్యం […]
Nalgonda |
జనంతో మమేకమై గెలుపు సాధించాలంటు సూచన
విధాత : రానున్న శాసనసభ ఎన్నికల్లో బీఆరెస్ అభ్యర్థులుగా ఖరారైన ఉమ్మడి నల్లగొండకు జిల్లాకు చెందిన 12మంది సిటింగ్ ఎమ్మెల్యేలు అంతా మంగళవారర మంత్రి జి.జగదీశ్రెడ్డి ఆధ్వర్యంలో ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తమ అభ్యర్ధిత్వాలను ప్రకటించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ జిల్లాలో ప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీ బలాబలాలపై ఆరా తీశారు. అభ్యర్ధులంతా ఇప్పటి నుండే నిత్యం జనంతో మమేకమవ్వాలని, పార్టీలోని అసంతృప్తులను సర్ధుబాటు చేసుకుని గెలుపు సాధనకు సర్వశక్తులొడ్డి పనిచేయలాని సూచించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను సక్రమంగా అందించడం ద్వారా, వివిధ వర్గాలతో ప్రత్యేక సమావేశాల ద్వారా ప్రజాదరణ లభించేలా చూసుకోవాలని సీఎం కేసీఆర్ తెలిపారు. ఖచ్చితంగా మనకు మంచి ఫలితాలు వస్తాయని, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మళ్లీ అన్ని సీట్లు గెలుస్తామని, రాష్ట్రంలో మూడోసారి తప్పకుండా అధికారంలోకి వస్తామని సీఎం కేసీఆర్ ధీమాను వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గాధరి కిశోర్ కుమార్, బొల్లం మల్లయ్య,యాదవ్, శానం పూడి సైదిరెడ్డి, చిరుమర్తి లింగయ్య, ఎన్.భాస్కర్ రావు, పైళ్ల శేఖర్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల భగత్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, రవీంద్ర నాయక్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సోమా భరత్ కుమార్ తదితరులు ఉన్నారు.