కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ కుంగుబాటు వ్యవహారంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆరెస్ల మధ్య సాగుతున్న పొలిటికల్ వార్ ఎత్తుకుపై ఎత్తులుగా సాగుతుంది
విధాత, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ కుంగుబాటు వ్యవహారంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆరెస్ల మధ్య సాగుతున్న పొలిటికల్ వార్ ఎత్తుకుపై ఎత్తులుగా సాగుతుంది. మేడిగడ్డ అవినీతిని ప్రజల కళ్ల ముందుంచుతామని సీఎం రేవంత్రెడ్డి, మంత్రుల బృందంతో కలిసి ఇటీవల మేడిగడ్డను సందర్శించి కేసీఆర్ ధనదాహానికి మేడిగడ్డ బలైందని ఆరోపించారు.
నేషనల్ డ్యాం సేఫ్టీ అథార్టీ నివేదికతో పాటు అన్నారం, సుందిళ్ల లీకేజీల నేపథ్యంలో వాటిలో నీళ్లు నింపే పరిస్థితి లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై అసెంబ్లీ లోపలా, బయట కాంగ్రెస్ బీఆరెస్ల మధ్య రచ్చరచ్చ సాగింది. కేసీఆర్ మీద కోపంతో మేడిగడ్డకు మరమ్మతులు చేయకుండా, అందులో నీళ్లు నింపకుండా బ్యారేజీ కొట్టుపోయేలా, కాళేశ్వరం ప్రాజెక్టును నిరూపయోగం చేసేలా కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి టి.హరీశ్రావు ఆరోపించారు.
అయితే సీఎం రేవంత్రెడ్డి బృందం మేడిగడ్డ సందర్శన రోజునే మాజీ సీఎం కేసీఆర్ నల్లగొండలో బీఆరెస్ బహిరంగ సభను నిర్వహించారు. రేవంత్రెడ్డి బృందం మేడిగడ్డను సందర్శించడాన్ని తప్పుబడుతూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ పోతం..బూరుగడ్డ పోతం..బొందల గడ్డ పోతం..ఏం అక్కడ తోకమట్ట ఏమైనా ఉన్నదా ఏం పీకనీకి పోయినవా ? మేడిగడ్డకు అంటూ రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం తాము కూడా అక్కడికెళ్లి కాంగ్రెస్ బండారం బయటపెడుతామన్నారు.
ఇప్పుడు డ్రామారావు ముఖచిత్రం ఏమిటో..