రైతులంటే… మీకు ఎందుకింత చిన్న చూపు..?
రైతులంటే.. మీకు ఎందుకింత చిన్నచూపు..? అని సీఎం రేవంత్రెడ్డిని బుధవారం మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు

- ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తపక్ప గల్లీలో రైతుల కన్నీళ్లు కనిపించవా?
- ట్విట్టర్లో సీఎం రేవంత్ను ప్రశ్నించిన మాజీ మంత్రి కేటీఆర్
విధాత: రైతులంటే.. మీకు ఎందుకింత చిన్నచూపు..? అని సీఎం రేవంత్రెడ్డిని బుధవారం మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. నిన్న.. పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదని, నేడు.. వడగండ్లు ముంచెత్తినా కన్నెత్తి చూడటంలేదన్నారు. ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప..గల్లీలో రైతుల కన్నీళ్లు కనిపించవా…? అన్నదాతల ఆర్థనాదాలు వినిపించవా..?? అని అడిగారు.
ఎన్నికల గోల తప్ప.. ఎన్నో కష్టాలు పడుతున్న రైతులపై కనికరం లేదా..? అని సీఎం రేవంత్రెడ్డిని మజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. సీట్లు.. ఓట్ల.. పంచాయతీ తప్ప.. అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా..? అని నిలదీశారు.
ముఖ్యమంత్రి గారు..
రైతులంటే.. మీకు ఎందుకింత చిన్నచూపు..?నిన్న.. పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదు..
నేడు.. వడగండ్లు ముంచెత్తినా కన్నెత్తి చూడటంలేదు..ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప..
గల్లీలో రైతుల కన్నీళ్లు కనిపించవా…?
అన్నదాతల ఆర్థనాదాలు వినిపించవా..??ఎన్నికల గోల… pic.twitter.com/CUcrdomGku
— KTR (@KTRBRS) March 20, 2024
ప్రజా పాలన అంటే.. 24/7 ఫక్తు రాజకీయమేనా..? పార్టీ ఫిరాయింపులపై ఉన్న దృష్టి.. పంటనష్టంపై లేదెందుకు ?? అని కేటీఆర్ సీఎం రేవంత్ను అడిగారు. పాడైపోయిన పంటలను పరిశీలించే తీరిక లేదా ? అని అన్నారు. హైకమాండ్ చుట్టూ చక్కర్లు కొట్టీ కొట్టీ.. రైతుల సమస్యలు వినే ఓపిక లేదా? అని ఎద్దేవా చేశారు.
ఇంతకాలం.. పచ్చని పైర్లు ఎండుతున్నా.. సాగునీరు ఇవ్వడం చేతకాలేదని, ఇప్పుడు..
నష్టపోయిన పంటలకు.. పరిహారం ఇవ్వాలన్న మనసు రావడం లేదా..? అని కేటీఆర్ రేవంత్ను అడిగారు. గుర్తు పెట్టుకోండి..!!ఎద్దేడ్సిన ఎవుసం..! రైతేడ్సిన “రాజ్యం బాగుండదు ..” !! అని రేవంత్ సర్కారును హెచ్చరించారు. అన్నదాతలకు జరుగుతున్న అన్యాయంపై.. భారత “రైతు” సమితి.. పోరాడుతూనే ఉంటుందని అన్న కేటీఆర్ జై కిసాన్…జై తెలంగాణ అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.