KTR | ఎట్టిపరిస్థితుల్లో ప్రాణ నష్టం జరగనివ్వం: మంత్రి కేటీఆర్
KTR ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు మాని ఇబ్బంది పడుతున్న ప్రజలకు సాయం చేయండి విధాత: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో పట్టణాల్లో ఉన్న పరిస్థితులపై పురపాలక శాఖ మంత్రి KTR సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో హైదరాబాదు నుంచి పురపాలక శాఖ అధికారులు, అడిషనల్ కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మంత్రి KTR పర్యటించారు. ఈ క్రమంలోనే హుస్సేన్ సాగర్ వద్ద వరద ఉధృతిని పరిశీలించారు. అలాగే నగరంలో ఎక్కడ […]

KTR
- ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు మాని ఇబ్బంది పడుతున్న ప్రజలకు సాయం చేయండి
విధాత: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో పట్టణాల్లో ఉన్న పరిస్థితులపై పురపాలక శాఖ మంత్రి KTR సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో హైదరాబాదు నుంచి పురపాలక శాఖ అధికారులు, అడిషనల్ కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మంత్రి KTR పర్యటించారు. ఈ క్రమంలోనే హుస్సేన్ సాగర్ వద్ద వరద ఉధృతిని పరిశీలించారు. అలాగే నగరంలో ఎక్కడ కూడా ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు. ప్రాణ నష్టం జరగకుండా చూడడమే ప్రాథమిక ప్రాధాన్యతగా పని చేయాలని అధికారులకు సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులపైన అప్రమత్తంగా ఉండాలని, వరద నీరు నిలిచిన పట్టణాల్లో మరిన్ని సహాయక చర్యలు చేపడతామని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న భవనాల నుంచి జనాలను వెంటనే తరలించాలని వెల్లడించారు.
ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు మాని భారీ వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని కేటీఆర్ అన్నారు. భారీ వర్షాల్లో నిరంతరం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల మనోధైర్యం దెబ్బతీసే విధంగా చిల్లర విమర్శలు చేయవద్దన్నారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు వర్షాన్ని ఎదుర్కొనేందుకు పనిచేస్తున్నాయి వారి మనో ధైర్యం దెబ్బతినకుండా నాయకులు మాట్లాడితే బాగుంటుందని మంత్రి KTR వెల్లడించారు.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలను ముఖ్యమంత్రి KCR ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు, పురపాలక శాఖ అధికారులతోనూ ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మాట్లాడారన్నారు. హైదరాబాద్లో GHMC కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో ఉన్న కిందిస్థాయి సిబ్బంది వరకు అందరూ పనిచేస్తున్నారని తెలిపారు. పురపాలక ఉద్యోగుల సెలవులన్నీ రద్దు చేయడం జరిగింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు ఫోన్ల ద్వారా ఇతర మాధ్యమాల ద్వారా సమీక్షిస్తున్నామన్నారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడం వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కానీ ఇప్పటిదాకా ఎలాంటి ప్రాణా నష్టం జరగకుండా సాధ్యమైనన్నీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని, ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రాణ నష్టం జరగకుండా చూడడమేనని మంత్రి తెలిపారు. హైదరాబాద్కు రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. హైదరాబాద్ నగరంలో డిసిల్టింగ్ కార్యక్రమాన్ని ఎప్పుడో పూర్తి చేశామన్నారు.
దీంతోపాటు చెరువుల బలోపేతం చేసే కార్యక్రమాలు కూడా చేపట్టాము. 135 చెరువులకు గేట్లు బిగించామన్నారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు అధికారులు సిబ్బంది కూడా విస్తృతంగా పనిచేస్తున్నారు, గతంలో ఇలాంటి భారీ వర్షాలు పడితే అనేక ప్రాంతాలు జలమయం అయ్యేవి. అయితే ఈసారి నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా చేపట్టిన కార్యక్రమాల వలన వరద ప్రభావం కొంతమేరకు తగ్గిందని, గత సంవత్సరంతో పోల్చుకుంటే వివిధ ప్రాంతాల్లో వరద సమస్య బాగా తగ్గిందని KTR తెలిపారు.