ధరణితో కోల్పోయిన భూములను గోండు గిరిజనులకు అప్పగిస్తాం

ధరణి మూలంగా భూములు కోల్పోయిన గోండు గిరిజనులకు తిరిగి ఆ భూములను అప్పగిస్తామని ఇంద్రవెల్లి సభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు

  • Publish Date - February 2, 2024 / 03:18 PM IST

గిరిజనులకు నీటి వనరులు అందుబాటులోకి తెస్తాం

ఇంద్రవెల్లి సభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

విధాత, ఆదిలాబాద్ ప్రతినిధి : ధరణి మూలంగా భూములు కోల్పోయిన గోండు గిరిజనులకు తిరిగి ఆ భూములను అప్పగిస్తామని ఇంద్రవెల్లి సభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. పోరాట యోధులు అమరుల , తాడిత పీడితుల ఆలోచనలను ఈ ప్రభుత్వం అమలు చేస్తుందని ఇటీవల రెండు కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కళాకారులకు అందించే నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను అందిస్తామని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తామని ఇంద్రవెల్లి అమరుల స్థూపంగా ప్రమాణం చేశామని, అధికారంలోకి రాగానే ఇదే అమరుల స్తూపం సాక్షిగా నాగోబా దేవాలయం సాక్షిగా అభివృద్ధి పనులు ప్రారంభించామని తెలిపారు. నేటి ఇంద్రవల్లి సభ సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు అన్నారు. కోరి తెచ్చుకున్న తెలంగాణ కొద్దిమంది చేతుల్లో బంది కాగా మేము అధికారంలోకి వస్తే మీ కష్టాలు తీరుస్తాం అని ఇదే ఆదిలాబాద్ జిల్లాలో ప్రకటించామని, మీ అందరి ఆశీస్సులతో ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేసుకున్నామన్నారు.


ఇచ్చిన మాట మరవకుండా వంశస్తుల నాగోబా దేవాలయం అభివృద్ధి కార్యక్రమాలతో ఈ రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామన్నారు. అమరుల స్తూపం సాక్షిగా ఇచ్చిన మాట మేరకు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి పని చేస్తామన్నారు. గోండుల జీవితాల్లో మార్పు రావాలని తన జీవితాన్ని అంకితం చేసిన గద్దర్ నా పీపుల్స్‌మార్చ్‌ పాదయాత్ర మొదలుపెట్టిన రోజు అమరుల స్తూపం వద్ద గోండుల జీవితాల మార్పు కోసం నాతో ప్రమాణం చేయించారని గుర్తు చేసుకున్నారు. ఐటీడీఏ ల పునరుద్ధరణ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు ఆర్థిక సాయం పెంచడం, త్రివేణి సంగమం, అభివృద్ధి చిహ్మాన్ ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరాడం జరిగిందని, ఈ పనులన్నీటిని పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్నారు.

Latest News