చట్టానికి సహకరించి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని సూచన BJP ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మహిళగా కవితకు ఇది ఓ కళంకం. చట్టానికి సహకరించండి, నిర్దోషిత్వాన్ని నిరూపించుకొండి అంటూ మాజీ మంత్రి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సూచించారు. అసలు మహిళలు చేసే బిజినెస్సేనా.. లిక్కర్స్కాంలో ఆడవాళ్ళు ఉంటారా అని మహిళలు అడుగుతున్నారు… ఇది టూ బ్యాడ్.. పరాకాష్ట… బిజినెస్ చేసుకోవడానికి ఇదే దొరికిందా? అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. పరకాల వచ్చిన సందర్భంగా రాజేందర్ […]
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మహిళగా కవితకు ఇది ఓ కళంకం. చట్టానికి సహకరించండి, నిర్దోషిత్వాన్ని నిరూపించుకొండి అంటూ మాజీ మంత్రి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సూచించారు. అసలు మహిళలు చేసే బిజినెస్సేనా.. లిక్కర్స్కాంలో ఆడవాళ్ళు ఉంటారా అని మహిళలు అడుగుతున్నారు… ఇది టూ బ్యాడ్.. పరాకాష్ట… బిజినెస్ చేసుకోవడానికి ఇదే దొరికిందా? అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. పరకాల వచ్చిన సందర్భంగా రాజేందర్ మీడియాతో మాట్లాడారు.
ఎమ్మెల్సీ కవిత విచారణ రాజకీయ కుట్ర అయితే రాష్ట్రంలోని వారి మీదనే విచారణ జరగాలి కానీ 6,7 రాష్ట్రాల రాజకీయ నాయకులు, వ్యాపార వర్గాలు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యాయన్నారు. తప్పు చేస్తే నా కొడుకు అయినా, బిడ్డనైనా వదిలిపెట్టనని అసెంబ్లీలో కెసిఆర్ చెప్పారని గుర్తుచేశారు.
ఢిల్లీకి పాకిన కుటుంబ పాలన
రాష్ట్రంలో సంపాదన సరిపోదన్నట్టుగా ఢిల్లీ దాకా ఎగపాకారనీ ఎద్దేవా చేశారు. రాజకీయ కుట్ర అయితే కోర్టు తేలుస్తుందని, రాజ్యాంగాన్ని, చట్టాన్ని అపహస్యం చేసే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. తప్పు చేసిన వారు తప్పించుకోలేరన్నారు. కెసిఆర్ అబద్ధాలను కూడా ప్రజలను నమ్మించే విధంగా చెప్పగలరన్నారు. దాచుకొండి దోచుకొండి. ఆపద వస్తే అండగా ఉంటామని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఏమన్నా రాసి ఇచ్చారా? మీకు కష్టం రాగానే కాపాడండి అని అడగడానికంటూ నిలదీశారు.
రాష్ట్ర అడిషనల్ అడ్వకెట్ జనరల్, మంత్రులు కవిత వెంబడి ఎలా పోతున్నారని, లిక్కర్ స్కాంకి వారికి ఏం సంబంధమంటూ ప్రజల సొమ్ము ఎలా ఖర్చు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దారిలో పోయే దానయ్య కంప్లైంట్ చేస్తే కనీసం విచారణ చేయకుండానే నన్ను తీసేస్తివి. ఈటల రాజేందర్ తప్పు చేశారా? కెసిఆర్ చేశారా అని అడిగితే ప్రజలు తేల్చి చెప్పారు. మీమీద ఆరోపణలు వస్తే మాత్రం విచారణ ఎదుర్కోడానికి వెనక్కు పోతున్నారంటూ ఈటల విరుచుకు పడ్డారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.