Miryalaguda విధాత: ఆజాదికా అమృత్ స్కీమ్లో భాగంగా మిర్యాలగూడ రైల్వే స్టేషన్ ను రూ18కోట్లతో ఆధునీకరణ, 9.14కోట్ల రూపాయలతో గూడ్స్ షెడ్ ను నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించే పనులు చేపట్టానున్నామని గుంటూరు రైల్వే డివిజన్ సీనియర్ కమర్షియల్ డివిజనల్ మేనేజర్ ఎం. దినేష్ కుమార్ తెలిపారు. శుక్రవారం స్థానిక రైల్వే స్టేషన్, గూడ్స్ షెడ్ పరిశీలించిన అనంతరం స్థానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ లో విలేఖరులతో మాట్లాడుతూ స్టేషన్ లో తాగు నీటి, మరుగుదొడ్లు, లైటింగ్ […]
Miryalaguda
విధాత: ఆజాదికా అమృత్ స్కీమ్లో భాగంగా మిర్యాలగూడ రైల్వే స్టేషన్ ను రూ18కోట్లతో ఆధునీకరణ, 9.14కోట్ల రూపాయలతో గూడ్స్ షెడ్ ను నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించే పనులు చేపట్టానున్నామని గుంటూరు రైల్వే డివిజన్ సీనియర్ కమర్షియల్ డివిజనల్ మేనేజర్ ఎం. దినేష్ కుమార్ తెలిపారు.
శుక్రవారం స్థానిక రైల్వే స్టేషన్, గూడ్స్ షెడ్ పరిశీలించిన అనంతరం స్థానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ లో విలేఖరులతో మాట్లాడుతూ స్టేషన్ లో తాగు నీటి, మరుగుదొడ్లు, లైటింగ్ సౌకర్యాలు మెరుగు పరిచనున్నామని ఆయన తెలిపారు. రైళ్ల రాక పోకల తెలిపే ఆటోమేటిక్ బోర్డులు, మైక్ ప్రకటనలు ఏర్పాటు చేయనున్నట్టు, ప్లాట్ ఫామ్ ప్రయాణికులకు అనుకూలంగా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోనున్నారని తెలిపారు.
మిర్యాలగూడ రైల్వే స్టేషన్ లో 13 రైళ్లు ఆగుతున్నాయని ఆయన తెలిపారు. వందేభారత్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ మిర్యాలగూడ స్టేషన్ లో 40 మంది ప్రయాణికులు టికెట్ తీసుకుంటే ఆపే అవకాశలు ఉన్నాయన్నారు. అదేవిధంగా వచ్చే ఆర్ధిక సంవత్సరంలో జగ్గయ్యపేట-మిర్యాలగూడ మధ్య ప్యాసింజర్ రైలు నడిపే అవకాశలుంటయని ఆయన అన్నారు.
అనంతరం రైస్ మిల్లర్లతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతు రోడ్డు రవాణా కంటే రైలు గూడ్స్ లో బియ్యం, దాన్యం ఇతర సరుకులు రవాణా చేయడం వల్ల డబ్బు, సమయం ఆదా అవుతుందన్నారు. తిప్పర్తి సమీపంలో ప్రైవేట్ లాజిస్టిక్ గోదాం అభ్యర్ధన మేరకు కార్గో టెర్మినల్ ఏర్పాటు చేశామని, అభ్యర్ధన వస్తే ఎక్కడైనా సాధ్యాసాధ్యలను పరిశీలించి ఏర్పాటు చేస్తామన్నారు.
ఆ టెర్మినల్ వల్ల సంవత్సరానికి 15కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. అదే విధంగా సకాలంలో రాక్లు ఏర్పాటు చేయాలని మిల్లర్లు కోరగా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైల్వేల ఏఒఎం పూర్ణచందర్ రావు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్నాటి రమేష్, స్థానిక అధ్యక్ష, కార్యదర్శులు గౌరు శ్రీనివాస్, బి. వెంకటరమణ చౌదరి, గుడిపాటి శ్రీనివాస్ ఉన్నారు.