బీఆరెస్ పార్టీ మార్చి 1న చలో మేడిగడ్డకు పిలుపునివ్వడాన్ని స్వాగతించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కన్సింగ్ ఠాకూర్ మేడిగడ్డ పర్యటనకు మాజీ సీఎం కేసీఆర్ను కూడా తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.
విధాత, హైదరాబాద్ : బీఆరెస్ పార్టీ మార్చి 1న చలో మేడిగడ్డకు పిలుపునివ్వడాన్ని స్వాగతించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కన్సింగ్ ఠాకూర్ మేడిగడ్డ పర్యటనకు మాజీ సీఎం కేసీఆర్ను కూడా తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో చేసిన అక్రమాలపై కేసీఆర్ కాళేశ్వరం శివుడి దగ్గరే తమ తప్పులు అన్ని ఒప్పుకోవాలని కీలక వ్యాఖ్యలు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఎందరో రైతులు భూములను, ఇండ్లను పోగొట్టుకుని, నిర్వాసితులుగా గ్రామాలను ఖాళీ చేసి తమ అస్థిత్వాలను త్యాగం చేశారని గుర్తు చేశారు. కాళేశ్వరంతో అదనంగా రైతులకు ఒరిగిందేమి లేకపోగా, ఈ ప్రాజెక్టుతో ఒక్క కేసీఆర్ కుటుంబమే కమిషన్లతో లాభపడిందని విమర్శించారు. ఇప్పిిటికే తమ సీఎం రేవంత్రెడ్డి మేడిగడ్డకు ఎమ్మెల్యేలను, మంత్రులను తీసుకెళ్లి జరిగిన డ్యామేజీని ప్రజల దృష్టికి తీసుకెళ్లారన్నారు. కేసీఆర్ ధనదాహానికి మేడిగడ్డ బ్యారేజీ బలైందన్నారు.