విధాత, నల్గొండ: తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టు లో మంగోలియా దేశపు బౌద్ధ ఆరామం ఏర్పాటు చేయనున్నట్లుగా మంగోలియా రాయబారి గాన్ బోల్డ్ ధామ్ బజావ్ తెలిపారు. బుధవారం నాగార్జున సాగర్లోని బుద్ధవనం ప్రాజెక్టును సందర్శించిన మంగోలియ రాయబారి బృందానికి సాగర్ శాసనసభ్యులు నోముల భగత్, బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్యలు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంగోలియా రాయబారి గాన్ బోల్డ్ ధామ్ బజావ్ మాట్లాడుతూ ఇప్పటివరకు భారతదేశంలో […]
విధాత, నల్గొండ: తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టు లో మంగోలియా దేశపు బౌద్ధ ఆరామం ఏర్పాటు చేయనున్నట్లుగా మంగోలియా రాయబారి గాన్ బోల్డ్ ధామ్ బజావ్ తెలిపారు. బుధవారం నాగార్జున సాగర్లోని బుద్ధవనం ప్రాజెక్టును సందర్శించిన మంగోలియ రాయబారి బృందానికి సాగర్ శాసనసభ్యులు నోముల భగత్, బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్యలు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంగోలియా రాయబారి గాన్ బోల్డ్ ధామ్ బజావ్ మాట్లాడుతూ ఇప్పటివరకు భారతదేశంలో బుద్ధ గయలో మాత్రమే మంగోలియా బౌద్ధారామం ఉందని, ఇకపై నాగార్జున సాగర్లోని బుద్ధ వనంలో కూడా మంగోలియా బౌద్ధారామం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భారతదేశానికి వచ్చిన 9నెలల్లోనే తమ దేశానికి భారత్కు మధ్య స్నేహపూర్వక బంధాన్ని బలపర్చేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు.
ఈ సందర్భంగా బుద్ధవనంలోని బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించిన అనంతరం బుద్ధవనాన్ని సంపూర్ణంగా సందర్శించారు. మహా స్తూపంలోని ధ్యాన మందిరంలో ధ్యానం చేశారు. అనంతరం నాగార్జునసాగర్ ప్రధాన డ్యాo సందర్శించారు. బౌద్ధ నిపుణులు ఈమని శివనాగిరెడ్డి బుద్ధ వనం విశేషాలు వివరించారు.
ఈ కార్యక్రమంలో బుద్ధవనం ఓఎస్డీ సుధన్ రెడ్డి, ఎస్ఈ క్రాంతి బాబు, బుద్ధవనం డిజైన్ ఇన్చార్జి శ్యాంసుందర్, ఏఈ నజీష్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్ణ బ్రహ్మ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మంద రఘువీర్ బిన్నీ,కౌన్సిలర్లు రామకృష్ణ, రమేష్ జి, పట్టణ యూత్ అధ్యక్షుడు ఆవుల దొడ్డి రాహుల్, కామెర్ల జానయ్య, తాటి సత్యపాల్ దితరులు పాల్గొన్నారు..