విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఓరుగల్లుకు చెందిన ఐదు దశాబ్దాల సాహితీవేత్త, కవి, న్యాయవాది నమిలికొండ బాలకిషన్ రావు గురువారం మధ్యాహ్నం హాస్పిటల్లో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆయన ఇంటికే పరిమితమయ్యారు. హనుమకొండ సాహితీపరులకు కొండంత అండదండగా నమలికొండ రాష్ట్ర వ్యాప్తంగా పరిచయం. చైతన్య సాహితి, సాంస్కృతిక సమాఖ్య, సాహితీ సమితి, పోతన విజ్ఞాన పీఠం, కాళోజీ ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులుగా, రాజరాజ నరేంద్రాంధ్ర భాషా నిలయంలో క్రియాశీల సభ్యుడిగా […]
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఓరుగల్లుకు చెందిన ఐదు దశాబ్దాల సాహితీవేత్త, కవి, న్యాయవాది నమిలికొండ బాలకిషన్ రావు గురువారం మధ్యాహ్నం హాస్పిటల్లో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆయన ఇంటికే పరిమితమయ్యారు.
హనుమకొండ సాహితీపరులకు కొండంత అండదండగా నమలికొండ రాష్ట్ర వ్యాప్తంగా పరిచయం. చైతన్య సాహితి, సాంస్కృతిక సమాఖ్య, సాహితీ సమితి, పోతన విజ్ఞాన పీఠం, కాళోజీ ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులుగా, రాజరాజ నరేంద్రాంధ్ర భాషా నిలయంలో క్రియాశీల సభ్యుడిగా విశేష సేవలు అందించారు. ప్రసారిక మాసపత్రిక ద్వారా నూతన తరానికి వేదిక కల్పించాడు. సాహితీ సమితి వేదిక నమలికొండ అధ్యక్షులుగా పనిచేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన ఇక్కడి కవులకు చాలామందికి సాహితీ సమితి ఒక వేదికగా నిలిచింది. ఇందుకు బాలకిషన్ రావు కృషి, ప్రోత్సాహము, ప్రేరణ, వితరణ ఎంతగానో వుంది. దేవులపల్లి రామానుజ రావు, చేతన వార్త కవులు, కాళోజి సోదరులతో, ప్రత్యక్ష పరిచయం, విడదీయరాని అనుబంధం నమలికొండది. సాహితీ సభలకు ‘నభారా’ ఒక ఎస్సెట్ గా ఉండేవాడు. అక్షర చిత్రాలు, శాంతి సమత, లాంటి అనేక కవితా సంపుటాలు ప్రకటించిన నమిలికొండ ఇక లేరన్న వార్త, సాహితీ ప్రియులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆయన మృతి సాహితీ లోకానికి తీరనిలోటని, పలువురు కవులు, కళాకారులు, సాహితీవేత్తలు సంతాపం తెలియజేశారు.