పాలనా రాజధాని కాబోతున్న విశాఖకు ఇప్పుడు మరో గుర్తింపు.. అందుబాటులోకి మరిన్ని రైలు, విమాన సేవలు విధాత: విశాఖను జీ 20 సదస్సుకు వేదికగా కేంద్రం ఎంపిక చేసింది. ఏడాది పాటు దేశమంతా జీ 20 సదస్సులను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా కీలకమైన నగరాలను ఎంపిక చేస్తోంది. ఏపీలో వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలలో రెండు సార్లు జీ 20 సన్నాకహ సదస్సులు నిర్వహిస్తునారు. వాటి కోసం విశాఖను వేదికగా ఎంపిక […]
విధాత: విశాఖను జీ 20 సదస్సుకు వేదికగా కేంద్రం ఎంపిక చేసింది. ఏడాది పాటు దేశమంతా జీ 20 సదస్సులను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా కీలకమైన నగరాలను ఎంపిక చేస్తోంది. ఏపీలో వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలలో రెండు సార్లు జీ 20 సన్నాకహ సదస్సులు నిర్వహిస్తునారు. వాటి కోసం విశాఖను వేదికగా ఎంపిక చేసారు.
విశాఖలో అదే సమయంలో గ్లోబల్ ఇన్వెసెట్మెంట్ సమ్మిట్ కూడా జరగనుంది. దాంతో స్మార్ట్ సిటీ ప్రాముఖ్యత మరింతగా పెరగనుంది. విశాఖను రాజధానిగా చేసుకోవాలని ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. దానికి అంది వచ్చిన అవకాశంగా అనేక జాతీయ అంతర్జాతీయ సదస్సులు ఇపుడు వైజాగ్ లో జరగనున్నాయి.
అటు హైదరాబాద్, ఇటు బెంగుళూరు, మరో వైపు చెన్నైలకు విశాఖ నుంచి రైల్, ఎయిర్ కనెక్టివిటీని ఇటీవల కాలంలో పెంచుతున్నారు. విశాఖ నుంచి విజయవాడ మీదుగా హైదరాబాదుకు వందే భారత్ రైలు కూడా వేస్తున్నారు. ఇంకా విశాఖ నుంచి తిరుపతికి కూడా మరో వందేభారతం ఎక్స్ ప్రెస్ ని కూడా రెడీ చేస్తున్నారు. అలా చెన్నై దాకా కూడా రైల్ కనెక్టివిటీని కొనసాగించనున్నారు.
విశాఖ నుంచి ఎయిర్ కనెక్టివిటీని ఈ మధ్య కాలంలోనే మరింతగా పెంచారు. విశాఖ నుంచి బెంగుళూరు కి ప్రతీ రోజు విమాన సేవలు అందిస్తూ ఆకాశ ఎయిర్ విమాన సర్వీసుని ఇటీవల ప్రారంభించారు. దాన్ని ప్రారంభించిన మంత్రి గుడివాడ అమరనాధ్ విశాఖ క్యాపిటల్ సిటీ అని ఇతర క్యాపిటల్ సిటీలతో అనుసంధానం పెద్ద ఎత్తున జరుగుతోంది అని పేర్కొన్నారు.
ఈ కొత్త సర్వీస్ ద్వారా రోజుకు రెండు సార్లు విశాఖ నుంచి బెంగుళూర్ కి విమానాలు నడుస్తాయి. జి-20 దేశాలకు భారత్ సారథ్యం వహిస్తున్న తరుణంలో దానికి సంబంధించిన అంశాలు, వివరాలు ప్రజలకు తెలిపేందుకు, అవగాహన కలిగించేందుకు 11 నెలలపాటు 56 నగరాల్లో 200 వరకూ సదస్సులు నిర్వహిస్తారు.
ఈ క్రమంలోనే విద్య, ఆర్థిక పురోగతి, వ్యవసాయం, పర్యావరణం, ఆరోగ్యం వంటి కీలక అంశాలమీద దాదాపు 37 సదస్సులు 2023 ఫిబ్రవరి 3 నుంచి 24 ఏప్రిల్ మధ్య విశాఖలో నిర్వహిస్తారు. దీంతో విశాఖ పేరుకు జాతీయ స్థాయిలో గుర్తింపు రానున్నది. దీంతోబాటు 2023 మార్చిలో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఓ వన్డే క్రికెట్ మ్యాచ్ కూడా విశాఖలో జరుగుతోంది.