NTR | 28న ఎన్టీఆర్ చిత్తరువుతో నాణెం విడుదల
హాజరుకానున్న మాజీ సీఎం చంద్రబాబు NTR | విధాత: విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు చిత్తరువుతో ఈనెల 28న వంద రూపాయిల నాణెం విడుదల చేయనున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కార్యక్రమం నిర్వహించనున్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది. అలాగే ఎన్టీఆర్తో పరిచయం ఉన్న పలువురు ప్రముఖులను […]

- హాజరుకానున్న మాజీ సీఎం చంద్రబాబు
NTR | విధాత: విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు చిత్తరువుతో ఈనెల 28న వంద రూపాయిల నాణెం విడుదల చేయనున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కార్యక్రమం నిర్వహించనున్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది. అలాగే ఎన్టీఆర్తో పరిచయం ఉన్న పలువురు ప్రముఖులను సైతం ఆహ్వానించారు. ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలతోపాటు వారి కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్లు కూడా హాజరవుతారని చెబుతున్నారు.
శతజయంత్యుత్సవాలను పురస్కరించుకుని..
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ నాణేన్ని ముద్రించింది. 44 మిల్లీ మీటర్ల చుట్టుకొలతతో ఉండే ఈ వంద రూపాయిల నాణేన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్తో తయారు చేశారు. అలాగే ఈ నాణేనికి ఓ వైపు మూడు సింహాలతో పాటు అశోక చక్రం ఉండగా మరోవైపు ఎన్టీఆర్ చిత్రం, ఆ చిత్రం కింద నందమూరి తారక రామారావు శతజయంతి అని హిందీ భాషలో ముద్రించారు. ఆయన శతజయంతి ఈ ఏడాదితో ముగియడంతో, 1923- 2023 అని ముద్రితమై ఉంటుంది