28న రాష్ట్ర పతి ముర్ము రామప్ప పర్యటన.. ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే సీతక్క

విధాత, వరంగల్: రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము ఈ నెల 28న రామప్ప పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క పరిశీలించారు. ములుగు నియోజక వర్గంలోని వేంకటాపూర్ మండలం పాలం పేట గ్రామంలోని శ్రీ రామప్ప రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని రాష్ట్రపతి సందర్శించనున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఏర్పాటుచేసిన హెలి ప్యాడ్ పనులను పరిశీలించారు. రాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జిల్లా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలు ప్రజా ప్రతినిధులు […]

28న రాష్ట్ర పతి ముర్ము రామప్ప పర్యటన.. ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే సీతక్క

విధాత, వరంగల్: రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము ఈ నెల 28న రామప్ప పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క పరిశీలించారు. ములుగు నియోజక వర్గంలోని వేంకటాపూర్ మండలం పాలం పేట గ్రామంలోని శ్రీ రామప్ప రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని రాష్ట్రపతి సందర్శించనున్నారు.

రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఏర్పాటుచేసిన హెలి ప్యాడ్ పనులను పరిశీలించారు. రాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జిల్లా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలు ప్రజా ప్రతినిధులు సమిష్టిగా పని చేసి రాష్ట్రపతి పర్యటన విజయవంతం చేయాలని సీతక్క కోరారు.

ఏర్పాట్లను దగ్గర ఉండి పూర్తి చేస్తున్న జిల్లా కలెక్టర్, జిల్లా పోలీస్ అధికారులు ఆర్ అండ్ బి, రెవెన్యూ శాఖ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పనులను చక చక పూర్తి చేయాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా దేవాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మల్లాడి రాం రెడ్డి, గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి, చెన్నోజు సూర్య నారాయణ, ఎండీ చాంద్ పాషా, బండి శ్రీనివాస్,ఆకు తోట చంద్ర మౌళి, మామిడి శెట్టి కోటి, మూడు వీరేష్, గ్రామ కమిటీ అధ్యక్షులు చెన్నోజు శ్రీను, ఎంపీటీసీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.