విధాత, సినిమా: డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, నటి ఛార్మీ కలిసి స్టార్ట్ చేసిన పూరీ కనెక్ట్స్ బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం ‘లైగర్’. బాలీవుడ్ నిర్మాతలతో కలిసి పూరి, ఛార్మీ ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా నిర్మించారు. రీసెంట్గానే ఈ సినిమా విడుదలైంది. అయితే విడుదలకు ముందు ఈ సినిమా విషయంలో మేకర్స్ వ్యవహరించిన తీరు.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ ఈ సినిమాపై కనబరిచిన కాన్ఫిడెన్స్ అయితే.. ఇంకేముంది […]
విధాత, సినిమా: డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, నటి ఛార్మీ కలిసి స్టార్ట్ చేసిన పూరీ కనెక్ట్స్ బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం ‘లైగర్’. బాలీవుడ్ నిర్మాతలతో కలిసి పూరి, ఛార్మీ ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా నిర్మించారు. రీసెంట్గానే ఈ సినిమా విడుదలైంది. అయితే విడుదలకు ముందు ఈ సినిమా విషయంలో మేకర్స్ వ్యవహరించిన తీరు.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది.
ముఖ్యంగా విజయ్ దేవరకొండ ఈ సినిమాపై కనబరిచిన కాన్ఫిడెన్స్ అయితే.. ఇంకేముంది పాన్ ఇండియా వైడ్గా ఈ సినిమా సంచలనాలకు కేంద్ర బిందువు కాబోతోంది అనేలా బీభత్సమైన క్రేజ్కి కారణమైంది. తీరా సినిమా విడుదలైన తర్వాత బిజినెస్ కోసమే ఇదంతా చేసి ఉంటారనేలా మాట్లాడుకోవడం ప్రేక్షకుల వంతైంది.
ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుండే నెగిటివ్ టాక్ని సొంతం చేసుకుని.. విజయ్ దేవరకొండ కెరీర్లో బిగ్గెస్ట్ ఫ్లాప్గా నిలిచింది. సినిమాని భారీ అమౌంట్కి కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు అంతే భారీగా నష్టపోయారు. కానీ నిర్మాతలైన పూరీ, ఛార్మీ ఇంకా బాలీవుడ్ వాళ్లు.. ఆ రైట్స్, ఈ రైట్స్ అంటూ బాగానే వెనకేసుకున్నారు. ఫలితంగా వారికి ఈ సినిమా లాస్ ప్రాజెక్ట్ కాదు.
కానీ, ఎంతో హైప్తో కొన్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ లబోదిబో అంటున్నారు. దీంతో రీసెంట్గా ‘ఆచార్య’ సినిమా విషయంలో డిస్ట్రిబ్యూటర్స్ ఏ పంథానైతే అనుసరించారో.. అదే మార్గంలో పూరి, ఛార్మీలను కొంతైనా రికవరీ చేయాలని కోరితే.. మా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు.. మేము కూడా భారీగా నష్టపోయాం అంటూ వారిద్దరూ చేతులెత్తేసినట్లుగా ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.
వాస్తవానికి ఈ సినిమాతో పూరి, ఛార్మీ బాగానే వెనకేసుకున్నారనేది ఇన్నర్ వర్గాల టాక్. ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, థియేట్రికల్ రైట్స్ ఇలా ముందే సినిమాని భారీగా అమ్మేసి, సొమ్ము చేసుకున్న నిర్మాతలు.. వారి సినిమా కొని భారీగా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లపై కొంచెం కూడా కనికరం చూపకుండా.. చిల్లిగవ్వ కూడా లేదంటూ చేతులెత్తేయడం ఏమిటనేలా ఇప్పుడు ఇండస్ట్రీలో వివాదం చెలరేగుతుంది. డిస్ట్రిబ్యూటర్లు.. కోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నట్లుగా సమాచారం.
ఇక ఈ సినిమా గురించి స్పందించమని అడిగితే.. విజయ్ దేవరకొండ ముఖం చాటేస్తుండటం మరో విశేషం. ఎందుకంటే.. ఈ సినిమాకి ఆయన రెమ్యూనరేషన్ కూడా పూర్తిగా ఇవ్వలేదని టాక్. మొత్తానికి పూరి, ఛార్మీ ‘లైగర్’ విషయంలో మంచి ప్లానింగ్తోనే సొమ్ము చేసుకున్నారనేలా ఇప్పుడు ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటోంది.