కుల వ్యవస్థకు శంకరాచార్యులు ప్రతినిధి: కేరళ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
విధాత, తిరువనంతపురం: కేరళ మంత్రి ఎంబీ రాజేశ్ జగద్గురువు ఆది శంకారాచార్యులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వివాదాన్ని రాజేశారు. ‘క్రూరమైన కుల వ్యవస్థ’కు ప్రతినిధిగా శంకరాచార్యులు ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేరళలోని వర్కాల శివగిరి మఠంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. శంకరాచార్యులు, శ్రీనారాయణ గురుదేవుల మధ్య సమాంతరాన్ని వివరించిన మంత్రి.. కేరళకు ‘ఆచార్య’ అంటే అది శ్రీ నారాయణ గురువే తప్ప ఆది శంకరాచార్యులు కాదన్నారు. శంకరాచార్యులు మనుస్మృతిపై ఆధారపడిన క్రూరమైన […]

విధాత, తిరువనంతపురం: కేరళ మంత్రి ఎంబీ రాజేశ్ జగద్గురువు ఆది శంకారాచార్యులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వివాదాన్ని రాజేశారు. ‘క్రూరమైన కుల వ్యవస్థ’కు ప్రతినిధిగా శంకరాచార్యులు ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేరళలోని వర్కాల శివగిరి మఠంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. శంకరాచార్యులు, శ్రీనారాయణ గురుదేవుల మధ్య సమాంతరాన్ని వివరించిన మంత్రి.. కేరళకు ‘ఆచార్య’ అంటే అది శ్రీ నారాయణ గురువే తప్ప ఆది శంకరాచార్యులు కాదన్నారు.
శంకరాచార్యులు మనుస్మృతిపై ఆధారపడిన క్రూరమైన కులవ్యవస్థను సమర్థిస్తే.. శ్రీనారాయణ గురువు మనుస్మృతి పారద్రోలేందుకు కృషి చేశారని తెలిపారు. శంకరాచార్య కుల వ్యవస్థను సమర్థించడంతో పాటు ప్రతినిధిగా ఉన్నారని, అయితే కుల వ్యవస్థను సమర్థించిన శంకరాచార్యపై శ్రీనారాయణ గురువు విమర్శించారని మంత్రి తెలిపారు.
సమాజంలో కుల వ్యవస్థ వేళ్లూనుకుపోవడానికి శంకరాచార్యులే కారణమని మంత్రి ఆరోపించారు. శంకరాచార్యులను విమర్శించింది నారాయణ గురువేనని, కుల వ్యవస్థ ప్రజలను కబళించిందని, దానికి శంకరాచార్యులు కూడా కారణమని శ్రీనారాయణ గురువే చెప్పారని రాజేశ్ తెలిపారు.
అయితే, కేరళ మంత్రి రాజేశ్ చేసిన వ్యాఖ్యలపై కేరళ మంత్రి వీ మురళీధరన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల్లో చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. సవర్ణ-అవర్ణ మనస్తత్వాన్ని సృష్టించి ఒక వర్గం ఓట్లను పొందేందుకు సీపీఎం తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు. శంకరాచార్యను అవమానించే ప్రయత్నాలను అడ్డుకోవాలని మురళీధరన్ పిలుపునిచ్చారు.