SCR Special Trains | ప్రయాణికులకు అలెర్ట్..! విశాఖపట్నం, సికింద్రాబాద్, తిరుపతి మార్గాల్లో 36 స్పెషల్ ట్రైన్ను ప్రకటించిన రైల్వే..!
SCR Special Trains | ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇప్పటికే నడుస్తున్న రైళ్లను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. విశాఖపట్నం-సికింద్రాబాద్, విశాఖపట్నం-మహబూబ్నగర్, విశాఖపట్నం-తిరుపతి, భువనేశ్వర్-తిరుపతి మార్గంలో నడుస్తున్న స్పెషల్ ట్రైన్స్ను పొడిగించింది. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వీక్లీ స్పెషల్ : రైలు నెంబర్ 08579 విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు వీక్లీ స్పెషల్ ట్రైన్ను జులై 5 నుంచి జులై 26 వరకు పొడిగించింది. ఈ రైలు […]

SCR Special Trains | ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇప్పటికే నడుస్తున్న రైళ్లను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. విశాఖపట్నం-సికింద్రాబాద్, విశాఖపట్నం-మహబూబ్నగర్, విశాఖపట్నం-తిరుపతి, భువనేశ్వర్-తిరుపతి మార్గంలో నడుస్తున్న స్పెషల్ ట్రైన్స్ను పొడిగించింది.
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వీక్లీ స్పెషల్ : రైలు నెంబర్ 08579 విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు వీక్లీ స్పెషల్ ట్రైన్ను జులై 5 నుంచి జులై 26 వరకు పొడిగించింది. ఈ రైలు ప్రతి బుధవారం రాత్రి 7 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.05 గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు చేరుకుంటుంది.
సికింద్రాబాద్-విశాఖపట్నం స్పెషల్ : రైలు నెంబర్ 08580 సికింద్రాబాద్ – విశాఖపట్నం వీక్లీ స్పెషల్ రైలును జులై 6 నుంచి జులై 27 వరకు దక్షిణ మధ్య రైల్వేను పొడిగించింది. ఈ రైలు గురువారం గురువారం రాత్రి 7.40 గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరుతుంది.
మరుసటి రోజు ఉదయం 9.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. రైలు దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, కైకలూరు, గుడివాడ, విజయవాడ , గుంటూరు , సత్తెనపల్లె, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగనున్నది.
విశాఖపట్నం-మహబూబ్నగర్ స్పెషల్ : రైలు నెంబర్ 08585 విశాఖపట్నం – మహబూబ్నగర్ వీక్లీ స్పెషల్ ట్రైన్ను జులై 4 నుంచి జులై 25 వరకు పొడిగించింది. ప్రతీ మంగళవారం సాయంత్రం 5.35 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 10.30 మహబూబ్నగర్ రైల్వేస్టేషన్ చేరుతుంది.
మహబూబ్నగర్-విశాఖపట్నం స్పెషల్ : రైలు నెంబర్ 08586 మహబూబ్నగర్ – విశాఖపట్నం వరకు వీక్లీ స్పెషల్ జులై 5 నుంచి జులై 26 వరకు పొడిగించింది. రైలు ప్రతీ బుధవారం సాయంత్రం 6.20 గంటలకు మహబూబ్నగర్లో బయలుదేరి వెళ్తుంది.
మరుసటి రోజు ఉదయం 9.50 గంటలకు విశాఖపట్నం స్టేషన్కు చేరుకుంటుంది. ఈ రైలు దువ్వాడ, అన్నవరం సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లె, మిర్యాలగూడ, నల్గొండ, మల్కాజిగిరి, కాచిగూడ, ఉందానగర్, షాద్నగర్, జడ్చర్ల స్టేషన్లలో ఆగనున్నది.
విశాఖపట్నం-తిరుపతి స్పెషల్ : రైలు నెంబర్ 08583 విశాఖపట్నం – తిరుపతి వరకు వీక్లీ స్పెషల్ ట్రైన్ను జులై 3 నుంచి జులై 31 వరకు పొడిగించింది. ప్రతీ సోమవారం రాత్రి 7 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి వెళ్తుంది. మరుసటి రోజు ఉదయం 9.15 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
తిరుపతి-విశాఖపట్నం స్పెషల్ : రైలు నెంబర్ 08584 తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు వీక్లీ స్పెషల్ ట్రైన్ను జులై 4 నుంచి ఆగస్ట్ 1 వరకు దక్షిణ మధ్య రైల్వే పొడిగించింది. ట్రైన్ ప్రతీ మంగళవారం రాత్రి 9.55 గంటలకు తిరుపతిలో బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం ఉదయం 10.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
ఈ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు , గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగనున్నాయి.
భువనేశ్వర్-తిరుపతి స్పెషల్ వీక్లీ : రైలు నెంబర్ 02809 భువనేశ్వర్ నుంచి తిరుపతి వరకు వీక్లీ స్పెషల్ రైలును జులై 1 నుంచి జులై 29 వరకు పొడిగించింది. ప్రతీ శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు భువనేశ్వర్లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు తిరుపతికి చేరుతుంది.
తిరుపతి-భువనేశ్వర్ స్పెషల్ వీక్లీ : రైలు నెంబర్ 02810 తిరుపతి నుంచి భువనేశ్వర్ వరకు వీక్లీ స్పెషల్ రైలును జులై 2 నుంచి జులై 30 వరకు పొడిగించింది. ఈ రైలు ప్రతీ ఆదివారం రాత్రి 8.15 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది. మరుసటి రోజు సాయంత్రం 5.25 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైళ్లు ఖుర్దారోడ్, బలుగాన్, బ్రహ్మాపూర్, పలాస, శ్రీకాకుళం, విజయనగరం, దువ్వాడ, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, ఒంగోలు, గుడ్డూరు, నెల్లూరు, గూడూరు రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే వివరించింది. ఆయా రైళ్లను ప్రయాణికులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసింది.