Congress | కాంగ్రెస్‌లో మళ్లీ సీనియర్ల కల్లోలం.. జానారెడ్డి, ఉత్తమ్‌లతో ఠాక్రే భేటీ..!

విధాత: కర్ణాటక ఫలితాలు తెచ్చిన ఊపు.. భట్టి పీపుల్స్ మార్చ్ పాదయాత్రతో వచ్చిన జోష్‌తో వచ్చే ఎన్నికలలో అధికార బీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టడంలో బలం పుంజుకున్న టీ. కాంగ్రెస్ (Congress) లో మళ్లీ సీనియర్ల అసమ్మతి కల్లోలంగా మారింది. ఒకవైపు బీఆర్ఎస్ నుండి రానున్న రోజుల్లో పెద్ద సంఖ్యలో వలసలు ఉంటాయని ధీమాతో ఉన్న కాంగ్రెస్ కు ఇంటిపోరు గుది బండగా తయారవుతుంది. తమ పార్టీ నుండి వలసలకు అడ్డుకట్ట వేసే పథకంలో బిఆర్ఎస్ అనుసరిస్తున్న ప్రతి […]

Congress | కాంగ్రెస్‌లో మళ్లీ సీనియర్ల కల్లోలం.. జానారెడ్డి, ఉత్తమ్‌లతో ఠాక్రే భేటీ..!

విధాత: కర్ణాటక ఫలితాలు తెచ్చిన ఊపు.. భట్టి పీపుల్స్ మార్చ్ పాదయాత్రతో వచ్చిన జోష్‌తో వచ్చే ఎన్నికలలో అధికార బీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టడంలో బలం పుంజుకున్న టీ. కాంగ్రెస్ (Congress) లో మళ్లీ సీనియర్ల అసమ్మతి కల్లోలంగా మారింది. ఒకవైపు బీఆర్ఎస్ నుండి రానున్న రోజుల్లో పెద్ద సంఖ్యలో వలసలు ఉంటాయని ధీమాతో ఉన్న కాంగ్రెస్ కు ఇంటిపోరు గుది బండగా తయారవుతుంది.

తమ పార్టీ నుండి వలసలకు అడ్డుకట్ట వేసే పథకంలో బిఆర్ఎస్ అనుసరిస్తున్న ప్రతి వ్యూహం కాంగ్రెస్ ను కలవరపరుస్తుంది. తమ పార్టీ నుండి కాదు.. మీ పార్టీ నుండే పలువురు సీనియర్లు మా పార్టీలోకి వస్తున్నారంటూ బిఆర్ఎస్ సాగిస్తున్న ప్రచార ఉచ్చులో కాంగ్రెస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఉత్తమ్, టి. జగ్గారెడ్డిలు బిఆర్ఎస్ లోకి వెళ్తారన్న ప్రచారం సాగుతుండగా, కొత్తగా జానారెడ్డి పై కూడా ఇదే తరహా ప్రచారం మొదలైంది.

దీంతో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రె స్వయంగా రంగంలోకి దిగి శనివారం సాయంత్రం మాజీ మంత్రి జానారెడ్డి ఇంటికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. అటు నుండి ఠాక్రే..జానారెడ్డిలు ఒకే కారులో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయన రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నందున పరామర్శకు వెళ్లామని వారు చెబుతున్నప్పటికీ పార్టీ మార్పు ప్రచారం, చేరికల వ్యవహారం పై సమాచారం లేని వివాదంతో కినుక వహించిన ఉత్తమ్ కుమార్ రెడ్డిని బుజ్జగించేందుకే వారిద్దరు వెళ్లారని తెలుస్తుంది.

ఇటీవల పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులతోపాటు కోదాడ నియోజకవర్గం బిఆర్ఎస్ ఇంచార్జి కన్మంతరెడ్డి శశిధర్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నట్లుగా తెలియడంతో ఉత్తమ్ కొంత అసహనానికి గురయ్యారు. నాకు తెలియకుండా నా జిల్లాలో చేరికలు ఏమిటంటు ఉత్తమ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

పార్టీ మారుతున్నానంటూ సాగుతున్న ప్రచారం వెనుక ప్రత్యర్ధి పార్టీ వారి కంటే.. సొంత పార్టీ వారి ప్రమేయం కూడా ఉందన్న ఆవేధన ఉత్తమ్ ను మనస్థాపానికి గురి చేసింది. ఆయా పరిణామాలతో ఇబ్బంది పడిన ఉత్తమ్ కు సర్ది చెప్పేందుకు, చేరికల పైన, పార్టీ మార్పు ప్రచారంపైన స్పష్టతనిచ్చేందుకు మాణిక్ రావు ఠాక్రే ఆయనతో భేటీ అయినట్లుగా తెలుస్తుంది.

జానా, ఉత్తమ్, జగ్గారెడ్డిలు ముగ్గురు కూడా ఠాక్రేతో మాట్లాడిన సందర్భంలో సందర్భంగా తమ పార్టీ మార్పు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ స్పష్టతనిచ్చినట్లుగా సమాచారం. గతంలోనే కేసీఆర్ తమకు మంత్రి పదవులు ఆశ చూపిన తాము చేర లేదని, అలాంటి తాము ఇప్పుడు ఎందుకు పార్టీని వీడుతామంటూ జానా, ఉత్తమ్ లు పార్టీ మార్పు ప్రచారాన్ని కొట్టిపారేశారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు రేపు కాంగ్రెస్ అధిష్టానం పిలుపుతో రేవంత్, పొంగులేటి, జూపల్లిలు ఢిల్లీ వెళ్తున్నారు. ఎల్లుండి రాహుల్ గాంధీతో వారి భేటీ.. చేరికల సభ విషయం చర్చించనున్నట్లుగా పార్టీ వర్గాల సమాచారం.