విమానాన్ని మధ్యలోనే వదిలేసిన వెళ్లిన ఎయిర్ ఇండియా పైలెట్ జైపూర్ ఎయిర్పోర్టులో ఘటన.. మరో పైలెట్తో ఢిల్లీకి విమానం విధాత: ఉద్యోగులు పనివేళలను సీరియస్గా తీసుకొంటే జరిగే విపరీతాలకు ఇదో మచ్చుతునక. షిప్ట్ టైమ్ ముగిసిన తర్వాత ఉద్యోగులు ఎలా వ్యవహరిస్తారో తెలిపే ఘటన ఇది. ఓ పైలెట్ (Pilot) అనూహ్య నిర్ణయం.. ప్రయాణికులకు చుక్కలు చూపించింది. తన డ్యూటీ టైమ్ ముగిసిందని విమానాన్ని మధ్యలో వదిలేసి వెళ్లిన ఘటన జైపూర్ ఎయిర్పోర్టులో శనివారం చోటుచేసుకున్నది. అసలు […]
విధాత: ఉద్యోగులు పనివేళలను సీరియస్గా తీసుకొంటే జరిగే విపరీతాలకు ఇదో మచ్చుతునక. షిప్ట్ టైమ్ ముగిసిన తర్వాత ఉద్యోగులు ఎలా వ్యవహరిస్తారో తెలిపే ఘటన ఇది. ఓ పైలెట్ (Pilot) అనూహ్య నిర్ణయం.. ప్రయాణికులకు చుక్కలు చూపించింది. తన డ్యూటీ టైమ్ ముగిసిందని విమానాన్ని మధ్యలో వదిలేసి వెళ్లిన ఘటన జైపూర్ ఎయిర్పోర్టులో శనివారం చోటుచేసుకున్నది.
అసలు ఏమి జరిగిందంటే..
షెడ్యూల్ ప్రకారం ఏఐ-112 విమానం లండన్ నుంచి ఢిల్లీకి శనివారం తెల్లవారుజామున 4 గంటలకు చేరాల్సి ఉన్నది. 350 మంది ప్రయాణికులతో వస్తున్నఈ విమానాన్ని ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా జైపూర్ ఎయిర్పోర్టుకు మళ్లించారు. కొన్ని గంటల తర్వాత ఢిల్లీకి వెళ్లేందుకు లండన్ విమానానికి అధికారుల నుంచి క్లియరెన్స్ లభించింది.
కానీ, పైలెట్ విమానం నడిపేందుకు నిరాకరించారు. తన షిప్ట్ టైమ్ అయిపోయిందని ప్రయాణికులను జైపూర్ ఎయిర్పోర్టులోనే వదిలేసి వెళ్లిపోయారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేసిన ఎయిర్ ఇండియా అధికారులు మరో పైలెట్ ద్వారా విమానాన్ని ఢిల్లీకి పంపించారు. మూడు గంటలు ఆలస్యంగా విమానం ఢిల్లీకి చేరుకున్నది. అయితే, విమాన ప్రయాణికుడు ఒకరు ఈ విషయాన్ని ట్విట్టర్లో పోస్టు చేశారు.
సహాయం చేయండి: ప్రయాణికుడు
@లండన్ నుంచి ఢిల్లీకి వచ్చే AI-112 విమానం చెడు వాతావరణం కారణంగా జైపూర్కు మళ్లించబడింది. దయచేసి మాకు అత్యవసరంగా సహాయం చేయండి. జైపూర్ ఎయిర్పోర్ట్ అధికారుల నుంచి మాకు ఎటువంటి సహాయం అందడం లేదు* అని పేర్కొన్నారు. జైపూర్ ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఫొటోలను కూడా షేర్ చేశారు.