President Droupadi Murmu విధాత: అల్లూరి సీతారామ రాజు 125వ జయంతి ముగింపు ఉత్సవాలలో ముఖ్యఅతిధిగా పాల్లొనడానికి మంగళవారం హైదరాబాద్కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ గవర్నర్ తమిళిసై , సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డిలు స్వాగతం పలికారు. రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు జీవన్ […]
President Droupadi Murmu
విధాత: అల్లూరి సీతారామ రాజు 125వ జయంతి ముగింపు ఉత్సవాలలో ముఖ్యఅతిధిగా పాల్లొనడానికి మంగళవారం హైదరాబాద్కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ గవర్నర్ తమిళిసై , సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డిలు స్వాగతం పలికారు.
రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నవీన్, శంభీపూర్ రాజు, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనికుమార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, మేడ్చల్ కలెక్టర్ తదితరులు ఉన్నారు.
హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మధ్యాహ్నం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియ స్టేడియం లో జరిగే అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి ముగింపు ఉత్సవాలలో సీఎం కేసీఆర్తో కలిసి పాల్గొననున్నారు.