Trains Cancelled | రైల్వే ప్రయాణికులకు అలెర్ట్.. విశాఖపట్నం – విజయవాడ మార్గంలో వారం పాటు పలు రైళ్లు రద్దు..!
Trains Cancelled | రైల్వే ప్రయాణికులకు అలెర్ట్ను జారీ చేసింది. విశాఖపట్నం - విజయవాడ మార్గంలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. విజయవాడ డివిజన్లో భద్రతాపరమైన ఆధునికీకరణ పనులు చేపడుతున్నట్లు నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. ఈ నెల 10 నుంచి 17వ తేదీ వరకు ట్రైన్స్ను దారి మళ్లించడంతో పాటు కొన్నింటిని రద్దు చేస్తున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి […]

Trains Cancelled |
రైల్వే ప్రయాణికులకు అలెర్ట్ను జారీ చేసింది. విశాఖపట్నం – విజయవాడ మార్గంలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. విజయవాడ డివిజన్లో భద్రతాపరమైన ఆధునికీకరణ పనులు చేపడుతున్నట్లు నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు.
ఈ నెల 10 నుంచి 17వ తేదీ వరకు ట్రైన్స్ను దారి మళ్లించడంతో పాటు కొన్నింటిని రద్దు చేస్తున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. గుంటూరు-విశాఖ ఎక్స్ప్రెస్ (రైలు నంబర్ 17239)ను 17 వరకు రద్దు చేసింది. రైలు నంబర్ 17240 విశాఖ-గుంటూరు సింహాద్రి ఎక్స్ప్రెస్ను 11వ తేదీ నుంచి 17 వరకు రద్దయ్యింది.
కాకినాడ – విశాఖపట్నం – కాకినాడ (రైలు నం. 17267-17268) ఎక్స్ప్రెస్ను 10వ తేదీ నుంచి నుంచి 16వ తేదీ రద్దు చేశారు. రాజమహేంద్రవరం-విశాఖ-రాజమహేంద్రవరం (ట్రైన్ నంబర్ 17239) ఈ నెల 10 నుంచి 16వ తేదీ వరకు రద్దు చేసింది.
ఈ నెల 11, 14, 15 తేదీల్లో ధన్బాద్-అళప్పుజ (రైలు నం.13351), 11న హటియా-ఎస్ఎంవీ బెంగళూరు (రైలు నంబర్ 12835), 14న టాటానగర్-ఎస్ఎంవీ బెంగళూరు (రైలు నంబర్ 12889), 15న హటియా-ఎస్ఎంవీ బెంగళూరు (రైలు నంబర్ 18637) రైళ్లను వయా నిడదవోలు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ మీదుగా దారి మళ్లించినట్లు వివరించారు.