TTD విధాత: తిరుపతి దేవస్థానంలో విరాళాల మీద ఎలాంటి అపోహలకు తావులేదని, ఎక్కడా పైసా కూడా దారిమళ్ల లేదని టిటిడి వెల్లడించింది. తిరుమల శ్రీవాణి ట్రస్టుకు వెళుతున్న విరాళాలు పక్కదారి పడుతున్నాయి అంటూ పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణ పెద్ద దుమారం లేపింది. దీంతో పవన్ ఆరోపణలు ఖండిస్తూ దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి శ్వేతపత్రం విడుదల చేసారు. శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టుకు (శ్రీవాణి ట్రస్ట్) భక్తులు అందించిన విరాళాలపై టీటీడీ ఛైర్మన్ వైవీ […]
విధాత: తిరుపతి దేవస్థానంలో విరాళాల మీద ఎలాంటి అపోహలకు తావులేదని, ఎక్కడా పైసా కూడా దారిమళ్ల లేదని టిటిడి వెల్లడించింది. తిరుమల శ్రీవాణి ట్రస్టుకు వెళుతున్న విరాళాలు పక్కదారి పడుతున్నాయి అంటూ పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణ పెద్ద దుమారం లేపింది.
దీంతో పవన్ ఆరోపణలు ఖండిస్తూ దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి శ్వేతపత్రం విడుదల చేసారు.
శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టుకు (శ్రీవాణి ట్రస్ట్) భక్తులు అందించిన విరాళాలపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం(June 23, 2023) శ్వేతపత్రం విడుదల చేశారు.
టీటీడీ బోర్డు తీర్మానం నం.388 ప్రకారం సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా పురాతన దేవాలయాల పునరుద్ధరణ, కొత్త ఆలయాలు, చిన్న ఆలయాల, భజన మందిరాల నిర్మాణానికి తోడ్పాటును అందించే ప్రధాన లక్ష్యంతో 2018 ఆగస్టు 28న శ్రీవాణి ట్రస్టు ఏర్పాటైయిందని తెలిపారు.
2019 సెప్టెంబర్ 23న బోర్డు తీర్మానం 23 ప్రకారం శ్రీవాణికి రూ.10,000/- విరాళం ఇచ్చిన దాతలకు ఒకసారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించిందన్నారు. అప్పటినుండి ట్రస్టు వాస్తవ కార్యాచరణ ప్రారంభమైందని తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార కాలనీల్లో ఆలయాల నిర్మాణానికిగాను టీటీడీ చేపట్టిన ఈ మహత్తర కార్యక్రమానికి నిధులు వెల్లువెత్తాయని… ఈ ఏడాది మే 31వ తేదీ వరకు, ఆన్లైన్, ఆఫ్లైన్లో భక్తులు శ్రీవారికి రూ. 861 కోట్లకు పైగా విరాళాలు అందించారని పేర్కొన్నారు.
శ్రీవాణి ట్రస్టు ద్వారా 8.25 లక్షల మంది భక్తులు శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 176 పురాతన ఆలయాల పునరుద్ధరణకు రూ. 93 కోట్లు మంజూరు చేశామని, వెనుకబడిన ప్రాంతాల్లో ఒక్కొక్కటి రూ.10 లక్షల వ్యయంతో మొత్తం 2,273 ఆలయాల నిర్మాణానికి ఆమోదం తెలిపామని చెప్పారు.
వీటిలో 1953 ఆలయాలను ఏపీ దేవాదాయ శాఖ, 320 ఆలయాలను సమరసత సేవ ఫౌండేషన్ నిర్మిస్తున్నామని తెలిపారు.ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల్లో 127 ప్రాచీన ఆలయాల పునరుద్ధరణకు రూ.139 కోట్లు కేటాయించామన్నారు.
టీటీడీ పరిపాలన పూర్తి పారదర్శకంగా నడుస్తోందని, ఇందులో భాగంగా ఇప్పటికే టీటీడీ ఆస్తులు, ఫిక్స్డ్ డిపాజిట్లు, బంగారం డిపాజిట్లపై శ్వేతపత్రం విడుదల చేశామని ఛైర్మన్ చెప్పారు. ప్రస్తుతం శ్రీవాణి ట్రస్ట్ నిధుల వినియోగంపై శ్వేతపత్రాన్ని విడుదల చేశామన్నారు.