విధాత : ఒక కాన్పులో కవలలు జన్మించడం చూశాం. కానీ ఒకే కాన్పులో ముగ్గురు, నలుగురు జన్మించడం అరుదుగా ఉంటుంది. ఆదిలాబాద్ రిమ్స్లో నిన్న ఓ గర్భిణి ఒకే కాన్పులో ముగ్గురు ఆడపిల్లలకు జన్మనివ్వగా, తాజాగా ఒడిశాకు చెందిన మరో మహిళ.. ఒకే కాన్పులో నలుగురికి జన్మనిచ్చింది. ఇందులో ముగ్గురు ఆడపిల్లలే ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా సోనేపూర్ జిల్లాలోని బాంజిపాలి గ్రామానికి చెందిన కుని సునా అనే మహిళకు నెలలు నిండాయి. దీంతో ఆమెకు సాంబల్పూర్ […]
విధాత : ఒక కాన్పులో కవలలు జన్మించడం చూశాం. కానీ ఒకే కాన్పులో ముగ్గురు, నలుగురు జన్మించడం అరుదుగా ఉంటుంది. ఆదిలాబాద్ రిమ్స్లో నిన్న ఓ గర్భిణి ఒకే కాన్పులో ముగ్గురు ఆడపిల్లలకు జన్మనివ్వగా, తాజాగా ఒడిశాకు చెందిన మరో మహిళ.. ఒకే కాన్పులో నలుగురికి జన్మనిచ్చింది. ఇందులో ముగ్గురు ఆడపిల్లలే ఉన్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా సోనేపూర్ జిల్లాలోని బాంజిపాలి గ్రామానికి చెందిన కుని సునా అనే మహిళకు నెలలు నిండాయి. దీంతో ఆమెకు సాంబల్పూర్ జిల్లాలోని వీర్ సురేంద్ర సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీకి వెళ్లింది. అక్కడ ఆమెకు వైద్యులు పురుడు పోశారు. కుని పండంటి నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. నలుగురిలో ఒకరు మగ శిశువు కాగా, మిగతా ముగ్గురు ఆడ పిల్లలు. తల్లీపిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. తక్కువ బరువుతో జన్మించిన ఈ నలుగురు పిల్లలకు స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు.