తమిళనాడులోని మదురైలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. 11 ఏళ్ల బాలికపై ఆర్మీ అధికారి, ఆమె మేనమామ దాడి చేసి, చంపేశాడు
మదురై: తమిళనాడులోని మదురైలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. 11 ఏళ్ల బాలికపై ఆర్మీ అధికారి, ఆమె మేనమామ దాడి చేసి, చంపేశాడు. ఈ ఘటన 22.03.2024న జరుగగా ఆమె మేనత్త ఆ బాలికను హాస్పిటల్కు తీసురావడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
తల్లిదండ్రులు చనిపోవడంతో అనాథగా మారిన బాలికను ఆర్మీ అధికారి అయిన మేనమామ చేరదీశాడు. మార్చి 22వ తేదీన అచేతన స్థితిలో ఉన్న బాలికను ఆమె మేనత్త హాస్పిటల్కు తీసుకొచ్చింది. అయితే.. ఆమె అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు.
అయితే.. బాలిక మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించగా.. ఆమెపై లైంగికదాడి జరిపి, ఊపిరాడనీయకుండా చేసి చంపారని తేలింది. దర్యాప్తు జరిపిన పోలీసు అధికారులు.. బాలికపై లైంగిక దాడి చేసింది ఆమె మేనమామేనని గుర్తించారు. మేనత్తకు ఈ విషయం తెలిసినా.. దాచి పెట్టేందుకు ప్రయత్నించింది. ఇద్దరినీ అరెస్టు చేసిన పోలీసులు.. పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.