ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటులో భాగంగా నేడు ఆదివారం ప్రధాని మోదీ, ఆయన మంత్రిమండలి ప్రమాణ స్వీకారం చేయనున్న క్రమంలో ఇప్పటివరకు 49మంది కేబినెట్ బెర్త్లు దక్కించుకున్నారు
విధాత : ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటులో భాగంగా నేడు ఆదివారం ప్రధాని మోదీ, ఆయన మంత్రిమండలి ప్రమాణ స్వీకారం చేయనున్న క్రమంలో ఇప్పటివరకు 49మంది కేబినెట్ బెర్త్లు దక్కించుకున్నారు. రాత్రి 7.15నిమిషాలకు ఢిల్లీ కర్తవ్య పథ్లో ప్రమాణ స్వీకార సమయానికి ఈ జాబితాలో మార్పులు చేర్పులకు అవకాశం లేకపోలేదంటున్నారు.
ఇప్పటివరకు మంత్రులుగా ఎంపికై ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం పొందిన ఎంపీలలో బీజేపీ సీనీయర్ నాయకులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, ఎస్. జైశంకర్, పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషి, జయంత్ చౌదరి, జితన్ రామ్ మాంఝీలు ఉన్నారు. అలాగే రామ్నాథ్ ఠాకూర్, చిరాగ్ పాశ్వాన్, హెచ్డి కుమారస్వామి, జ్యోతిరాదిత్య సింధియా, అర్జున్ రామ్ మేఘవాల్, ప్రతాప్ రావ్ జాదవ్, రక్షా ఖడ్సే, జితేంద్ర సింగ్, రాందాస్ అథవాలే, కిరణ్ రిజుజు, రావ్ ఇంద్రజీత్ సింగ్, శంతను ఠాకూర్, మన్సుఖ్ మాండవియా, అశ్విని వైష్ణవ్, బండి సంజయ్, జి కిషన్ రెడ్డి, హర్దీప్ సింగ్ పూరి, బీఎల్ వర్మ, శివరాజ్ సింగ్ చౌహాన్, శోభా కరంద్లాజే, రవ్నీత్ సింగ్ బిట్టు, సర్బానంద సోనోవాల్, అన్నపూర్ణా దేవి, జితిన్ ప్రసాద్, మనోహర్ లాల్ ఖట్టర్, హర్ష్ మల్హోత్రా, నిత్యానంద రాయ్, అనుప్రియా పటేల్, అజయ్ తమ్తా, ధర్మేంద్ర ప్రధాన్, నిర్మలా సీతారామన్, సావిత్రి ఠాకూర్, రామ్ మోహన్ నాయుడు కింజరాపు, చంద్రశేఖర్ పెమ్మసాని, మురళీధర్ మొహల్, కృష్ణపాల్ గుర్జర్, గిరిరాజ్ సింగ్, గజేంద్ర సింగ్ షెకావత్, శ్రీపాద్ నాయక్, సి.ఆర్.పాటిల్, నర్సాపురం బీజేపీ ఎంపీ శ్రీనివాస్ వర్మకు చోటు దక్కింది.