కగార్ పేరుతో దండకారణ్యంలో ఊచకోత … మావోయిస్టు రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్

జల్, జంగల్, జమీస్ కోసం పోరాడుతున్న విప్లవకారులపైన, ఆదివాసీలపైన నూతనంగా కగార్ పేరుతో కేంద్రప్రభుత్వం సైనిక క్యాంపెయిన్ చేపట్టి ఆరు నెలలుగా ఊచకోత మొదలు పెట్టారని భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు), తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ తీవ్రంగా ఖండించారు

కగార్ పేరుతో దండకారణ్యంలో ఊచకోత … మావోయిస్టు రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్

విధాత ప్రత్యేక ప్రతినిధి: జల్, జంగల్, జమీస్ కోసం పోరాడుతున్న విప్లవకారులపైన, ఆదివాసీలపైన నూతనంగా కగార్ పేరుతో కేంద్రప్రభుత్వం సైనిక క్యాంపెయిన్ చేపట్టి ఆరు నెలలుగా
ఊచకోత మొదలు పెట్టారని భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు), తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ తీవ్రంగా ఖండించారు. బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో ముఖ్యంగా మధ్య భారతంలోని దండకారణ్యంలో పోరాటం కొనసాగిస్తున్నట్లుగా పేర్కొన్నారు.బీజాపూర్ జిల్లా ముదువెండి గ్రామంలో ఆరు నెలల పాపతో మొదలైన ఊచకోత వారానికొక ఘటనతో ఇంకా కొనసాగుతూనే వుందన్నారు. ఆరు నెలల పాప నుండి మొదలుకుని ఆరు పదులు దాటిన ముసలి వాళ్ళను కూడా వదలకుండా సామూహిక హత్యలకుపాల్పడ్డారని విమర్శించారు. జనవరి నుండి ఇప్పటికి 130కి మందిపైగా హత్యలు చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పిట్టపడా, చిపురు బట్టి, కొల్చల్, పిడియా, ఆపటోలా, కాకూర్ లాంటి ప్రాంతాల్లో అమానవీయ చర్యలకు పాల్పడుతూ నరసంహారం సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హత్యలకు గురైనా వారి శవాలకు డ్రెస్ లు తొడిగి ఎన్ కౌంటర్లుగా చిత్రికరిస్తున్నారని మండిపడ్డారు.

భారత దేశంలో జరుగుతున్న ఇంతటి నరసంహారాన్ని చూసి స్పందించిన అంతర్జాతీయ సమాజం ఏకమై భారత ప్రజాయుద్ధాన్ని కాపాడుకోవడానికిఅమెరికా, లాటిన్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా ఖండాలలో కగార్ పేరుతో చట్ట విరుద్ధంగా జరుగుతున్న ఫాసిస్టు దురాగతాలను వ్యతిరేకిస్తున్నారని వివరించారు. అయా దేశాల్లో కగార్ వ్యతిరేక ప్రదర్శలను చేపడుతున్నారన్నారు. విప్లవ ప్రతిఘాతుక కగార్ దాడిని విప్లవ ప్రజానీకం, వేధావులు, ప్రజాస్వామిక వాదులు, రచయితలు, జర్నలిస్టులు కూడా నిర్వద్వందగా వ్యతిరేకిస్తున్నారన్నారు. మన దేశ ప్రజలపై కొనసాగుతున్న నిర్దాక్షిణ్యమైన పాశవిక సైనికదాడులను తక్షణమే నిలిపి వేయాలని, మోహరించిన బలగాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారత ప్రజాయుద్ధ అంతర్జాతీయ సంఘీభావ కమిటీ జూలై 1వ తేదీన ప్రపంచ కగార్ వ్యతిరేక దినంగా పాటించాలని పిలుపునిచ్చిందని తెలిపారు. ఈ పిలుపునకు మద్దతుగా తెలంగాణ విప్లప ప్రజలు, మేధావులు, ప్రజుస్వామికవాదులు, రచయితలు, ప్రజా హితం కోరుతున్నవాళ్ళు జూలై 1న కగార్ వ్యతిరేక ప్రదర్శనలు చేపట్టాలని జగన్ ఆ ప్రకటనలో కోరారు.

**