కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా వినడం కూడా నేరంగా ఉండేదని ప్రధాని మోడీ అన్నారు. రాజస్థాన్లోని టోంక్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా వినడం కూడా నేరంగా ఉండేదని ప్రధాని మోడీ అన్నారు. రాజస్థాన్లోని టోంక్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ సహా ఇండియా కూటమిపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆస్తులను లాక్కుని కొందరు ప్రత్యేక వ్యక్తులకు పంచాలనే కుట్ర పన్నుతున్నదని మరోసారి ఆరోపించారు. నిజాన్ని బయటపెడితే కాంగ్రెస్ ఎందుకు భయపడుతున్నదని ప్రధాని ప్రశ్నించారు.
2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు తగ్గించడం ద్వారా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నం చేసిందని ప్రధాని ఆరోపించారు. ‘మొన్న నేను రాజస్థాన్ వచ్చినప్పుడు 90 సెకన్లు ఒక విషయంపై మాట్లాడాను. అందులో ఓ నిజాన్ని దేశం ముందుంచాను. కాంగ్రెస్ మీ ఆస్తులను లాక్కుని కొందరు ప్రత్యేక వ్యక్తులకు పంచాలనే కుట్ర పన్నుతున్నదన సత్యాన్ని బైటపెట్టాను. కాంగ్రెస్ ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయ పరదాను తీసి చూపించాను. దీనిపై కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీలకు ఎంత మండుతున్నదంటే వాళ్లు అన్నివిధాలుగా నన్ను తిట్టడం మొదలుపెట్టారు. ఎవరు వస్తే వాళ్లు మోడీని తిడుతున్నారు. నేను కాంగ్రెస్ నుంచి ఒకటి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. నిజాన్ని బయటపెడితే కాంగ్రెస్ ఎందుకు భయపడుతున్నది? ఆ విధానాన్ని మీరే (కాంగ్రెస్) రూపొందించినప్పుడు మోదీ దాని వెనుక ఉన్న అజెండాను భయటపెట్టారు. మీకు ధైర్యం ఉంటే అంగీకరించండి. మిమ్నల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.