Bandaru Dattatreya | మోదీతో బండారు ద‌త్తాత్రేయ మ‌న‌వ‌రాండ్ల ముచ్చ‌ట‌.. చిన్నారుల క‌విత‌ల‌కు ప్ర‌ధాని ఫిదా.. వీడియో

Bandaru Dattatreya | హ‌ర్యానా గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి న్యూఢిల్లీలోని పార్ల‌మెంట్ హౌస్‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని బుధ‌వారం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లుసుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణ భగవానుని ’విరాట్ స్వరూప్’ విగ్రహాన్ని దత్తాత్రేయ ప్రధానికి బహూకరించారు.

  • Publish Date - June 26, 2024 / 10:58 PM IST

Bandaru Dattatreya | న్యూఢిల్లీ : హ‌ర్యానా గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి న్యూఢిల్లీలోని పార్ల‌మెంట్ హౌస్‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని బుధ‌వారం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లుసుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణ భగవానుని ’విరాట్ స్వరూప్’ విగ్రహాన్ని దత్తాత్రేయ ప్రధానికి బహూకరించారు. వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. హర్యానా చరిత్ర, సామాజిక- సాంస్కృతిక వారసత్వం, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పలు అంశాలపై ప్రధాని మోడీతో గవర్నర్ దత్తాత్రేయ చర్చించారు.

గవర్నర్ సతీమణి బండారు వసంత, ఆమె కుమార్తె బండారు విజయలక్ష్మి, అల్లుడు డాక్టర్ బి.జిగ్నేష్ రెడ్డి, దత్తాత్రేయ మనవరాండ్లు యశోధర రెడ్డి, వేదాన్షి రెడ్డి కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మిస్ యశోధర, మిస్ వేదాన్షి కూడా ప్రధాని కోసం హిందీలో రెండు క‌విత‌లు చ‌దివి వినిపించారు. ఈ క‌విత‌లు – ‘మాం సే జ్యాదా మాత్రభూమి కో జిసనే మాన్ దియా, ఖుద్ కా జీవన్ భీ జైసనే”, ”దిల్ పే హాథ రఖ్ కే యే కసమ్ లే హమ్ సభీ, న జుకేగా దేశ్ అపనా న జుకేంగే హమ్ కభీ!”లకు ముగ్ధులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారిని ప్రేమ‌గా కౌగిలించుకుని, అభినందించి ఆశీర్వదించారు.

Latest News