అయ్యప్ప భక్తులకు గుడ్న్యూస్.. శబరిమల వెళ్లేందుకు స్పెషల్ వందే భారత్ ఎక్స్ప్రెస్..!
ఈ నెల 17న శబరిమల అయ్యప్పస్వామి ఆలయ ద్వారా తెరచుకోనున్నాయి. మకర విళక్కు సందర్భంగా ఆలయం తెరువనుండగా.. దాదాపు రెండు నెలలకుపైగా అయ్యప్ప దీక్షా స్వాములు తరలివచ్చి స్వామివారిని దర్శించుకోనున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున భక్తులు కేరళకు తరలివచ్చే అవకాశం ఉండడంతో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. శబరిమల వెళ్లే భక్తుల కోసం వందే భారత్ రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

ఈ నెల 17న శబరిమల అయ్యప్పస్వామి ఆలయ ద్వారా తెరచుకోనున్నాయి. మకర విళక్కు సందర్భంగా ఆలయం తెరువనుండగా.. దాదాపు రెండు నెలలకుపైగా అయ్యప్ప దీక్షా స్వాములు తరలివచ్చి స్వామివారిని దర్శించుకోనున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున భక్తులు కేరళకు తరలివచ్చే అవకాశం ఉండడంతో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. శబరిమల వెళ్లే భక్తుల కోసం వందే భారత్ రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
ఈ మేరకు షెడ్యూల్ సైతం ప్రకటించింది. అయ్యప్ప భక్తుల కోసం చెన్నై – తిరునల్వేలి మధ్య ప్రత్యేకంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ను నడుపనున్నట్లు పేర్కొంది. చెన్నై ఎగ్మోర్- తిరునల్వేలి (06067) ప్రత్యేక వందే భారత్ రైలు ఈ నెల 16, 23, 30, డిసెంబర్ 7, 14, 21, 28 తేదీల్లో ఉదయం 6 గంటలకు చెన్నై ఎగ్మోర్ రైల్వేస్టేషన్లో బయలుదేరుతుంది. మధ్యాహ్నం 2.15 గంటలకు తిరునల్వేలి చేరుకుంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు మళ్లీ బయలుదేరి రాత్రి 11.15 గంటలకు ఎగ్మోర్ స్టేషన్కు చేరుకుంతుంది.
రెండు మార్గాల్లో రైలు తాంబరం, విల్లుపురం, తిరుచ్చి, దిండుగల్, మధురై, విరుదునగర్ స్టేషన్లలో ఆగుతాయని పేర్కొంది. అలాగే శబరిమలకు వెళ్లే భక్తుల కోసం ఏపీ నుంచి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తాంబరం-సంత్రాగచ్చి (06079) ప్రత్యేక సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు ఈ నెల 22న అందుబాటులో ఉంటుంది. మధ్యాహ్నం ఒంటిగంటలకు తాంబరంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.45 గంటలకు సంత్రగాచి చేరుకుంటుంది.
అలాగే సంత్రాగచ్చి – తాంబరం (06080) ప్రత్యేక సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ నెల 16, 23 తేదీల్లో రాత్రి 11.40 గంటలకు సంత్రగాచి మూడోరోజు ఉదయం 9.35 గంటలకు తాంబరం చేరుకుంటుంది. ఈ రైళ్లు చెన్నై ఎగ్మోర్, గూడురు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, సింహాచలం నార్త్, విజయనగరం, పలాస, కుర్దా రోడ్డు, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసోర్, ఖరగ్పూర్ స్టేషన్లలో ఆగుతాయని చెప్పింది.
తాంబరం – భువనశ్వేర్ (06081) స్పెషల్ సూపర్ఫాస్ట్ రైలు ఈ నెల 21న మధ్యాహ్నం ఒంటిగంటకు తాంబరంలో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 9.55 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది. భువనేశ్వర్ – తాంబరం (06082) రైలు ఈ నెల 22న మధ్యాహ్నం 12.50 గంటలకు భువనేశ్వర్లో బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 12 గంటలకు తాంబరం చేరుతుంది. ప్రస్తుతం ఆయా రైళ్లలో వెయింటింగ్ లిస్ట్ భారీగా ఉండడంతో మరికొన్ని ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు రైల్వేశాఖ వివరించింది.