విధాత,న్యూఢిల్లీ: జాపాలి తీర్ధంలోని అంజనాద్రి పర్వతాన్ని హనుమంతుని జన్మస్థలంగా ప్రకటించే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జీ.కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రాచీన సాహిత్యం, శాసనాలు, చారిత్రక, ఖగోళ శాస్త్ర అంచనాలు వంటి ఆధారాలతో సహా హనుమంతుడి జన్మస్థలం తిరుమలకు ఉత్తరంగా జాపాలి తీర్ధంలోని అంజనాద్రి పర్వతమేనని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ధారించిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా అన్న ప్రశ్నకు టీటీడీ దీనిపై విడుదల చేసిన పుస్తకం,పత్రికలలో వచ్చిన […]
విధాత,న్యూఢిల్లీ: జాపాలి తీర్ధంలోని అంజనాద్రి పర్వతాన్ని హనుమంతుని జన్మస్థలంగా ప్రకటించే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జీ.కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రాచీన సాహిత్యం, శాసనాలు, చారిత్రక, ఖగోళ శాస్త్ర అంచనాలు వంటి ఆధారాలతో సహా హనుమంతుడి జన్మస్థలం తిరుమలకు ఉత్తరంగా జాపాలి తీర్ధంలోని అంజనాద్రి పర్వతమేనని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ధారించిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా అన్న ప్రశ్నకు టీటీడీ దీనిపై విడుదల చేసిన పుస్తకం,పత్రికలలో వచ్చిన వార్తల ద్వారా ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లు చెప్పారు.