ఎంపీ రఘురామకృష్ణరాజు ఎంపీలకు లేఖ
తన అరెస్ట్ తదనంతర పరిణామాలను వివరిస్తూ ఆయన లేఖ రాశారు. ★ రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో పార్టీలకు అతీతంగా తనకు మద్దతివ్వాలని లేఖలో కోరారు. ★ దేశంలో తొలిసారి ఓ ఎంపీపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని తెలిపారు. ★ అయితే ఎంపీ రఘురామ లేఖను చూసి పలువురు ఎంపీలు విస్మయానికి గురైనట్లు తెలుస్తోంది. ★ జగన్ ప్రభుత్వానిది హిట్లర్ పాలనగా కాంగ్రెస్ ఎంపీ మానిక్కం ఠాగూర్ అభివర్ణించారు. ★ రఘురామ లేఖను ట్విటర్లో ఠాగూర్ పోస్ట్ […]

తన అరెస్ట్ తదనంతర పరిణామాలను వివరిస్తూ ఆయన లేఖ రాశారు.
★ రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో పార్టీలకు అతీతంగా తనకు మద్దతివ్వాలని లేఖలో కోరారు.
★ దేశంలో తొలిసారి ఓ ఎంపీపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని తెలిపారు.
★ అయితే ఎంపీ రఘురామ లేఖను చూసి పలువురు ఎంపీలు విస్మయానికి గురైనట్లు తెలుస్తోంది.
★ జగన్ ప్రభుత్వానిది హిట్లర్ పాలనగా కాంగ్రెస్ ఎంపీ మానిక్కం ఠాగూర్ అభివర్ణించారు.
★ రఘురామ లేఖను ట్విటర్లో ఠాగూర్ పోస్ట్ చేశారు.
★ రఘురామపై పోలీసుల దాడిని ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందని పలువురు ఎంపీలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
★ ఎంపీలకు రాసిన లేఖలపై స్పందించడానికి రఘురామ నిరాకరించారు.
★ అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి జగన్రెడ్డి బెయిల్ను రద్దు చేయాలని తాను సీబీఐ కోర్టులో పిటిషన్ వేశానన్న కక్షతోనే తనపై అక్రమ కేసులు బనాయించారని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు రఘురామ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
★ ఆయన బుధవారం రాత్రి ఇక్కడ 9.20 గంటలకు స్పీకర్ను కలిశారు.
★ దాదాపు అర్ధ గంట సమావేశమయ్యారు.
★ ఈ సందర్భంగా తనపై పెట్టిన రాజద్రోహం కేసు, తదనంతర పరిస్థితులన్నీ వివరిస్తూ వినతిపత్రం సమర్పించారు.
★ తన కేసులో సీఎం జగన్రెడ్డి, డీజీపీ, సీఐడీ ఏడీజీ సునీల్కుమార్, ఏఎ్సపీ విజయ్పాల్పై చర్యలు తీసుకోవాలని కోరారు.