తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన…పోలవరం నిర్వాసితుల్ని పరామర్శించిన లోకేష్.కూనవరం మండలం టేకులబోరు గ్రామంలో నిర్వాసితులతో సమావేశమైన లోకేష్. విధాత:మా జీవితాలతో జగన్ ప్రభుత్వం ఆడుకుంటుంది.రెండేళ్లుగా వరదలు వచ్చి ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం ఆదుకోలేదు.మోసపు హామీలు నమ్మి ఓట్లేసి మోసపోయాం.ఇస్తామన్న ప్యాకేజీ ఇవ్వకుండా బెదిరించి ఊర్లు ఖాళీ చేయిస్తున్నారు.విలీన మండలాలను కనీసం పట్టించుకోవడం లేదు.చంద్రబాబు హయాంలో కట్టిన పునరావాస ఇళ్లు తప్ప జగన్ వచ్చి ఒక్క ఇళ్లు కూడా కట్టలేదు.వరదల సమయంలో […]
తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన…
పోలవరం నిర్వాసితుల్ని పరామర్శించిన లోకేష్.
కూనవరం మండలం టేకులబోరు గ్రామంలో నిర్వాసితులతో సమావేశమైన లోకేష్.
విధాత:మా జీవితాలతో జగన్ ప్రభుత్వం ఆడుకుంటుంది.రెండేళ్లుగా వరదలు వచ్చి ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం ఆదుకోలేదు.
మోసపు హామీలు నమ్మి ఓట్లేసి మోసపోయాం.ఇస్తామన్న ప్యాకేజీ ఇవ్వకుండా బెదిరించి ఊర్లు ఖాళీ చేయిస్తున్నారు.విలీన మండలాలను కనీసం పట్టించుకోవడం లేదు.చంద్రబాబు హయాంలో కట్టిన పునరావాస ఇళ్లు తప్ప జగన్ వచ్చి ఒక్క ఇళ్లు కూడా కట్టలేదు.వరదల సమయంలో వైకాపా ప్రభుత్వం కనీసం వాటర్ ప్యాకెట్ కూడా ఇవ్వలేదు.రెండు బంగాళాదుంపలు ఒక కోవొత్తు ఇచ్చి పొమ్మన్నారు.పోయిన ఏడాది వరదలు వచ్చినప్పుడు ఇస్తామన్న రూ.2.000 సాయం కూడా ఈ రోజు వరకూ ఇవ్వలేదు.నిత్యావసర సరుకుల కూడా ఇవ్వడం లేదు.
…పోలవరం నిర్వాసితులు
పోలవరం నిర్వాసితులను జగన్ రెడ్డి జల సమాధి చేస్తున్నాడు.నిర్వాసితుల త్యాగాల ఫలితం పోలవరం. ఇది కేవలం 1.90 లక్షల మంది చిన్న సమస్య మాత్రమేనని వైకాపా నాయకులు అంటున్నారు.ఇది చిన్న సమస్య కాదు..చాలా పెద్ద సమస్య. ఇది ఐదు కోట్ల ఆంధ్రుల సమస్య.ఆంధ్రుల జీవనాడి పోలవరాన్ని జగన్ రెడ్డి నాశనం చేస్తున్నారు.సోమవారాన్ని పోలవారంగా మార్చి ప్రాజెక్ట్ ని పరుగులు పెట్టించారు చంద్రబాబు.కానీ ఇప్పుడు మంగళవారం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పోలవరాన్ని చంపేస్తున్నారు.రెండున్నర ఏళ్ల పాలనలో రివర్స్ టెండరింగ్ పేరుతో కాలక్షేపం తప్ప ప్రాజెక్ట్ ముందుకు కదిలింది లేదు.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గాలి కబుర్లు చెప్పి గిరిజనుల్ని మోసం చేసిన గాలి గాడు జగన్ రెడ్డి.
గిరిజనుల దగ్గరకొచ్చి ముద్దులు పెట్టాడు, మొసలి కన్నీరు కార్చాడు, మోసపు హామీలు ఇచ్చాడు.2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అన్నాడా? లేదా?భూమికి భూమి, పోడు భూమికి పట్టా, 18 ఏళ్ల నిండిన వారందరికీ ప్యాకేజ్ ఇస్తా అని మరో హామీ.ఆర్ అండ్ ఆర్ కింద పది లక్షల ప్యాకేజి, ఎకరానికి 1.50 లక్షల ప్యాకేజ్ వచ్చిన వారికీ అదనంగా 5 లక్షల ప్యాకేజ్ ఇస్తా అన్నారు.మెమొచ్చాకా ఎకరానికి 19 లక్షల ప్యాకేజ్ ఇస్తామంటూ గాలి కబుర్లు చెప్పాడు. ఈ గాలి గాడు జగన్ రెడ్డి. ఎకరానికి 19 లక్షలు ఇస్తానాన్నడా? లేదా?25 రకాల సౌకర్యాలతో నిర్వాసితులకు పునరావాస కాలనీలు కడతాం అన్నారు. కట్టారా?ఇచ్చిన ఒక్క హామీ కూడా నిలబెట్టుకొని వాడిని ఏమంటాం? గాలి గాడు అంటాం.జగన్ రెడ్డి గిరిజనుల పాలిట శాపంగా మారారు.ప్రతిపక్షంలో హామీల వర్షం కురిపించిన జగన్ రెడ్డి ఇప్పుడు గిరిజనుల గుండెల పై గునపం దింపుతున్నాడు. జేసీబీలు పంపి ఇళ్లు కూల్చేస్తున్నారు. పరిహారం, పునరావాసం పూర్తవ్వకుండా గిరిజనుల ఇళ్ళు కూల్చే హక్కు నీకెవడిచ్చాడు జగన్ రెడ్డి?పోలీసుల్ని పంపి ఊర్లు ఖాళీ చెయ్యాలంటూ భయపెడుతున్నారు.కొండ పైకి వెళ్లి పాక వెనుకుందాం అనుకుంటే దానికి ఒప్పుకోవడం లేదు.ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే వ్యవసాయం చేసుకున్న మీరు సొంత ఊరుకి రావాలంటే అధికారుల అనుమతులు తీసుకోవాల్సిన దుస్థితి.జగన్ రెడ్డి పాలనలో పోలవరం నిర్వాసితులు మానసిక క్షోభకి గురవుతున్నారు.జగన్ రెడ్డి జిఓ లు నాలిక గీసుకోవడానికి కూడా పనికి రావు. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు అందుకే ఇప్పుడు ఆ జిఓ లు కూడా రహస్యంగా పెట్టుకుంటున్నారు.
ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని వాడు పోలవరం నిర్వాసితులకు పరిహారం ఇస్తాడా?చంద్రబాబు హయాంలో 33 వేల కోట్ల పునరావాస ప్యాకేజీకి కేంద్రం ఒప్పకుంటే ప్రతిపక్షంలో ఉండి జగన్ పుల్లలు వేసి అడ్డుకున్నాడు.హామీలు ఇచ్చింది జగన్ రెడ్డి కానీ ఇప్పుడు పరిహారం ఇవ్వాల్సింది కేంద్రం అంటూ జగన్ రెడ్డి జంప్ అయిపోతున్నారు.275 గ్రామాలకు గాను 9 గ్రామాలకు మాత్రమే పరిహారం అందించారు. అది కూడా అంతంత మాత్రమే. ఈ స్పీడ్ లో పరిహారం ఎప్పటికి అందుతుంది. గుజరాత్ సర్దార్ సరోవర్ డ్యామ్ కి పట్టిన దుస్థితి జగన్ పాలనలో పోలవరానికి వచ్చింది.41.15 మీటర్ల కాంటూరు నిర్వాసితుల కోసం రూ.3,200 కోట్లు కావాల్సి ఉంటే రూ.550 కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకున్నారు, ఇవి కూడా కాగితాలకే పరిమితం అయ్యింది, మొత్తం ఇవ్వలేదు. నిర్వాసితులకు ఇచ్చిన వాటిలో రూ.100 కోట్లు అవినీతి జరిగింది.
నిర్వాసితులు పరిహారం కోసం ఎదురు చూస్తుంటే వైసీపీ నాయకులు మాత్రం నిర్వాసితుల పేరుతో పరిహారాన్ని దోచుకుంటున్నారు. నిర్వాసితులకు దక్కాల్సిన పరిహారం వైసీపీఎమ్మెల్యేలు, వైకాపా కుక్కలు కొట్టేసారు. పోలవరం నిర్వాసితులకే తెలియకుండా, ఎవరిదీ కాని భూమికి తప్పుడు పత్రాలు సృష్టించి సొమ్ముని కాజేస్తున్నారు. గిరిజనుల పేరుతో వారికి తెలియకుండా ఖాతాలు తెరిచి, పరిహారం డబ్బులు వేసుకుని, వారికి తెలియకుండా డబ్బులు డ్రా చేసుకున్నారు.జగన్ రెడ్డి కి దమ్ముంటే పునరావాస ప్యాకేజీలో వైసిపి దోపిడీ వ్యవహారంపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలి.జూన్ 2020 నాటికే 18 వేల నిర్వాసితులను ఇళ్లలోకి పంపిస్తామని, మిగిలిన వారిని 2021 మే నాటికి పంపిస్తామని ఇరిగేషన్ మంత్రి డబ్బాలు కొట్టారు.
ఏమయ్యాయి ఆయన చెప్పిన మాటలు?నోటిపారుదల మంత్రి అనిల్ కి నీటిపారుదల పై అవగాహన నిల్లు. గతంలో ముగ్గురు ముఖ్యమంత్రులు ఐదేళ్లలో పోలవరం నిర్మాణానికి ఖర్చుపెట్టింది కేవలం రూ.5,135 కోట్లు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రయ్యాక రూ.11,537 కోట్లు ఖర్చుపెట్టి, ఐదేళ్ల లోనే 72శాతం వరకు ప్రాజెక్ట్ పనులు పూర్తి చేశారు.ఆర్టీఐ చట్టం ప్రకారం, ఈ రెండేళ్ళలో జూన్ మొదటి వారానికి రూ.845 కోట్లు ఖర్చు చేశారు. వాటిలో కేవలం డ్యాంసైట్ కు రూ.445 కోట్లు ఖర్చు పెట్టారు. 4 శాతం మాత్రమే పూర్తి చేసారు.టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు సంబంధించి దాదాపు రూ.4వేల కోట్లు కేంద్రం నుంచి రీయంబర్స్ చేసుకొని వాటిని నిర్వాసితులకు ఎందుకు చెల్లించలేకపోయారు? తండ్రి వైఎస్ విగ్రహం ఏర్పాటు చెయ్యడానికి రూ.200 కోట్లు కేటాయించిన జగన్ రెడ్డి నిర్వాసితులను మాత్రం గాలికొదిలేసారు.జగన్ రెడ్డి కి దమ్ము,ధైర్యముంటే గిరిజనుల దగ్గరకు వచ్చి మాట్లాడాలి. చెట్టుకొకరు, పుట్టకొకరుగా మారి కొండల్లో బతుకుతున్న గిరిపుత్రులకు ఇళ్లు ఎప్పుడిస్తారో ముఖ్యమంత్రి చెప్పాలి.
కనీసం గిరిజన కుటుంబాలకు ఈ ప్రభుత్వం పాకలు వేసుకోవడానికి అవసరమైన బొంగులు, తాటాకులు కూడా ఇవ్వలేదు. గిరిజనులు ఏం పాపం చేశారని ఈ ముఖ్యమంత్రి వారిపై అంతలా కక్ష కట్టాడు. ముఖ్యమంత్రేమో పెద్దపెద్ద ఎస్టేట్లు, ప్యాలెస్ లలో ఉంటాడు. తమ భూములను రైతాంగం కోసం త్యాగం చేసిన గిరిజనులు మాత్రం కొండలపై బతకాలా? ఇదేమీన్యాయం? హక్కుల కోసం పోరాడితే గిరిజనుల పై కేసులు పెట్టి, గిరిజన ప్రజా ప్రతినిధులను కటిక నేల పై కూర్చోబెట్టి అవమానించారు.గిరిజనులు, నిర్వాసితులు కొండలు,గుట్టలపైకెక్కి ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని బతుకుతుంటే, ఈముఖ్యమంత్రి సిమ్లాలో ఎంజాయ్ చేయటానికి వెళ్ళాడు.
విలీన మండలాలను జగన్ రెడ్డి నిర్లక్ష్యం చేసాడు. చంద్రబాబు విలీన మండలాల వారు త్యాగం చేసారు కాబట్టి స్కూల్లు,ఆసుపాత్రులు కట్టారు. జగన్ రెడ్డి కానీ,మంత్రులు కానీ విలీన మండలాల వారి దగ్గరకు వచ్చి వారి సమస్యలు వినడం లేదు.పోలవరం నిర్వాసితులకు ఈ ప్రభుత్వం ఇంత అన్యాయం చేస్తున్నా, ఎస్టీ వర్గానికి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరూ ముఖ్యమంత్రిని ప్రశ్నించలేని దుస్థితిలో ఉన్నారు. అసలు ఎస్టీ ప్రజాప్రతినిధులకు అపాయింట్మెంట్ కూడా సీఎం ఇవ్వడం లేదు.గతంలో చంద్రబాబు కట్టిన ప్రాజెక్ట్ వద్దకెళ్లి ఫొటోలు దిగి, అంతా తామే చేశామని చెప్పుకోవడం కాదు? చేతనైతే గిరిజనుల ముందుకెళ్లి నిలబడండి.జగన్ రెడ్డి నిర్వాసితులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే వరకూ వారికి అండగా టీడీపీ పోరాటం చేస్తుంది. చిట్ట చివరి నిర్వాసితుడికి న్యాయం జరిగే వరకూ నేను ఈ పోరాటంలో ముందుటాను.
…నారా లోకేష్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి