రిటైర్డ్ ఉన్నతాధికారులకు సచివాలయంలో తేనీటి విందు

విధాత,హైదరాబాద్: రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శనివారం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తేనీటి విందునిచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి 1970 అనంతరం నుండి ఇటీవలి కాలం వరకు రిటైర్ అయిన ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు పెద్ద సంఖ్యలో తమకుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. కొత్తగా నిర్మించిన దేవాలయం, మస్జీద్, చర్చి లను సందర్శించారు.

అనంతరం, సెక్రెటేరియట్ లోని 6వ అంతస్తు తోపాటు వివిధ ఫ్లోర్ లను తిరిగి పరిశీలించారు.ఈ సందర్భంగా సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. నూతన సచివాలయ నిర్మాణాన్ని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి అధికారులు ప్రశంసించారు.

ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఎ.కె.కుట్టి, సుజాతరావు, వి.పి.జవహరి, పి.సి.పరేఖ్, కె.వి.రావు, రాజీవ్ శర్మ, ఎస్.కె.జోషి, జై భరత్ రెడ్డి, రస్తోగి, మిన్ని మాథ్యూస్, ఎ.కె.గోయల్, దినకర్ బాబు, జి.సుధీర్, టి.ఎస్.అప్పారావు, జి.నాగి రెడ్డి, రేమండ్ పీటర్ లు పాల్గొన్నారు.