ఉత్తర్వులు జారీ చేసిన ఐజీ ధ్రువీకరించిన ఎస్పీ రోహిణి ప్రియదర్శని విధాత, మెదక్ బ్యూరో: మెదక్ పట్టణానికి చెందిన ఖాదీర్ ఖాన్ను చోరీ కేసులో విచారణ పేరుతో చిత్ర హింసలు పెట్టి ఆయన మృతికి కారణమయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్న (మెదక్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్) సీఐ మధు, si రాజశేఖర్, కానిస్టేబుళ్లు పవన్, ప్రశాంత్లను ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సస్పెండ్ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ధృవీకరించారు. మహిళ మెడలో నుంచి చైన్ […]
విధాత, మెదక్ బ్యూరో: మెదక్ పట్టణానికి చెందిన ఖాదీర్ ఖాన్ను చోరీ కేసులో విచారణ పేరుతో చిత్ర హింసలు పెట్టి ఆయన మృతికి కారణమయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్న (మెదక్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్) సీఐ మధు, si రాజశేఖర్, కానిస్టేబుళ్లు పవన్, ప్రశాంత్లను ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సస్పెండ్ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ధృవీకరించారు.
మహిళ మెడలో నుంచి చైన్ దొంగతనం కేసులో జరిగిన కేసులో ఖదీర్ ఖాన్ను హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి విచారణ పేరుతో పోలీసులు అతని కిడ్నీలపై కొట్టడంతో తీవ్ర అస్వస్థతకు గురై గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ విషయమై మృతుడి భార్య సిద్ధేశ్వరి ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
ఐదు రోజుల పాటు పోలీస్ స్టేషన్లో బందించి కొట్టినట్లు మృతుని కుటుంబ సభ్యులు పేర్కొనడంతో mim అధినేత అసదుద్దీన్ ఓవైసీ డీజీపీ అంజనీ కుమార్కు ఫిర్యాదు చేశారు. ఎస్పీ, కలెక్టర్కు పోలీసులపై ఫిర్యాదు చేయడంతో ఈ ఘటనపై ఐజీ చంద్ర శేఖర్ రెడ్డిని విచారణ అధికారిగా నియమించారు.
ఎంక్వైరీ ఆధారంగా, ఎస్పీ పంపిన నివేదిక ఆధారంగా సీఐ మధు, SI రాజశేఖర్, కానిస్టేబుళ్లు పవన్ ప్రశాంత్లను సస్పెండ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఒక ప్రకటనలో తెలిపారు.