యువ జర్నలిస్టు దారుణహత్య.. క్లినిక్లపై కథనాలు రాశాడని ఘాతుకం
విధాత:నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన 22 ఏండ్ల జర్నలిస్టు దారుణ హత్యకు గురయ్యాడు.నకిలీ క్లినిక్లపై కథనాలు రాయడం తో ఆ జర్నలిస్టుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.బీహార్లోని మధుబని జిల్లాకు చెందిన బుద్ధినాథ్ జా అలియాస్ అవినాష్ జా (22) లోకల్ న్యూస్ పోర్టల్లో జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు.ఇటీవల నకిలీ క్లినిక్లపై రాసిన కథనాలను తన ఫేస్బుక్లో పోస్టు చేశాడు. నాటి నుంచి బుద్ధినాథ్కు బెదిరింపులు కూడా వచ్చాయి. తమ క్లినిక్లను బయటకు లాగొద్దని కొందరు ఆ జర్న లిస్టుకు […]

విధాత:నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన 22 ఏండ్ల జర్నలిస్టు దారుణ హత్యకు గురయ్యాడు.నకిలీ క్లినిక్లపై కథనాలు రాయడం తో ఆ జర్నలిస్టుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.బీహార్లోని మధుబని జిల్లాకు చెందిన బుద్ధినాథ్ జా అలియాస్ అవినాష్ జా (22) లోకల్ న్యూస్ పోర్టల్లో జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు.ఇటీవల నకిలీ క్లినిక్లపై రాసిన కథనాలను తన ఫేస్బుక్లో పోస్టు చేశాడు. నాటి నుంచి బుద్ధినాథ్కు బెదిరింపులు కూడా వచ్చాయి.
తమ క్లినిక్లను బయటకు లాగొద్దని కొందరు ఆ జర్న లిస్టుకు లంచం ఆశ చూపినప్పటికీ లొంగలేదు.దీంతో మంగళ వారం రాత్రి అతన్నికిడ్నాప్ చేశారు. బెనిపట్టీ లోహి యా చౌక్లోని తన నివాసం వద్ద చివరిసారిగా మంగళవారం రాత్రి 10 గంటలకు కనిపించినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది.
బుద్ధినాథ్ నివాసం బెనిపట్టి పోలీసు స్టేషన్కు 400 మీటర్ల దూరంలో ఉంది. అయితే రాత్రి 9 గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చిన బుద్ధినాథ్.. రోడ్డుపై తిరుగుతూ పలు ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది. తన క్లినిక్ కూడా తెరిచే ఉంది. ల్యాప్ టాప్ ఆన్ చేసి ఉంది. చివరగా రాత్రి 9:58 గంటలకు కనిపించగా ఆ సమయంలో పసుపు రంగు స్కార్ఫ్ మెడలో వేసుకుని ఉన్నాడు.
బుద్ధినాథ్ జా రెండు రోజులైనా ఇంటికి తిరిగిరాక పోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జర్నలిస్ట్ ఫోన్ సిగ్నల్స్ను పోలీసులు ట్రేస్ చేయగా బెనిపట్టీకి ఐదు కిలోమీటర్ల దూరంలోని బెటౌన్ వద్ద సిగ్నల్స్ బుధవారం రాత్రి 9గంటలకు కట్ అయినట్లు గుర్తించారు.
పోలీసులు అక్కడికి చేరుకున్నప్పటికీ అక్కడ బుద్ధినాథ్ కనిపించలేదు. బెటౌన్ జాతీయ రహదారి పక్కన జర్నలిస్టు మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. చేతికి ఉన్నరింగ్, మెడలో ఉన్న బంగారు గొలుసు, కాలిపై ఉన్న గాయంతో అతను బుద్ధినాథ్ అని కుటుంబ సభ్యులు గుర్తించారు. జర్నలిస్టుపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీసులు నిర్ధారించారు.