విశాఖ ఐఆర్ఎస్ అధికారి సుందర్ సింగ్పై సీబీఐ కేసు
విశాఖ,విధాత: ఐఆర్ఎస్ అధికారి దాసి సాధు సుందర్ సింగ్పై సీబీఐ కేసు నమోదు అయింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనకు సంబంధించిన ఇళ్లు, ఆఫీసుల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఐటీ అప్పిలేట్ ట్రిబ్యునల్ అకౌంటెంట్ మెంబర్గా సుందర్ పని చేస్తున్నారు. సాధు సుందర్కు చెందిన రూ.4.71 కోట్ల ఆస్తులను సీబీఐ అధికారులు గుర్తించారు. ప్రసుత్తం మార్కెట్ విలువ ప్రకారం రూ. 50 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. […]

విశాఖ,విధాత: ఐఆర్ఎస్ అధికారి దాసి సాధు సుందర్ సింగ్పై సీబీఐ కేసు నమోదు అయింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనకు సంబంధించిన ఇళ్లు, ఆఫీసుల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఐటీ అప్పిలేట్ ట్రిబ్యునల్ అకౌంటెంట్ మెంబర్గా సుందర్ పని చేస్తున్నారు. సాధు సుందర్కు చెందిన రూ.4.71 కోట్ల ఆస్తులను సీబీఐ అధికారులు గుర్తించారు. ప్రసుత్తం మార్కెట్ విలువ ప్రకారం రూ. 50 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కుటుంబ సభ్యులతో పాటు సాధు పేరు మీద భారీగా ఆస్తులు ఉన్నట్లు నిర్ధారించారు. హైదరాబాద్, విశాఖలో సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి.