ఫ్రీ సింబల్‌గా జనసేన గాజు గ్లాసు

పవన్ కల్యాణ్ జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తును ఎన్నికల కమిషన్ ఫ్రీ సింబల్‌గా ప్రకటించింది

  • Publish Date - April 5, 2024 / 04:46 PM IST

విధాత: పవన్ కల్యాణ్ జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తును ఎన్నికల కమిషన్ ఫ్రీ సింబల్‌గా ప్రకటించింది. జనసేన పోటీ చేసే 21 స్థానాల్లోనే కాకుండా, మిగిలిన 154 స్థానాల్లో పోటీ చేసే ఇండిపెండెంట్లకి ఫ్రీ సింబల్ గా జనసేన గాజు గ్లాసు గుర్తుని కేటాయించాలని నిర్ణయించింది. ఎన్నికల కమిషన్ నిర్ణయంతో జనసేన నేతలు, కూటమి అభ్యర్థులు తల పట్టుకున్నారు. ఈ నిర్ణయం టీడీపీ, బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తే స్థానాల్లో ప్రతికూలతగా మారవచ్చన్న ఆందోళన నెలకొంది.

జనసేన పోటీ చేయని చోట టీడీపీ, బీజేపీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. వారికి జనసేన ఓట్ల బదలాయింపు జరుగాల్సివుంది. ఆ స్థానాల్లో గాజుగ్లాసు గుర్తును ఇండిపెండెంట్‌లకు కేటాయిస్తే సరైన అవగాహాన లేని ఓటర్లు గాజు గ్లాసుకు ఓటు వేసే ప్రమాముందన్న ఆందోళన కూటమి నేతల్లో వ్యక్తమవుతుంది. దీంతో ఈ సమస్యను అధిగమించేందుకు జనసేన నాయకత్వం న్యాయ పోరాటానికి సిద్ధమవుతుంది.

Tags:  

Latest News