విధాత: రహదారుల వాస్తవ పరిస్థితిపై సీఎం జగన్కు ఎంపీ రఘురామ లేఖ రాశారు. మరమ్మతులు చేయని కారణంగా రహదారుల పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. కోస్తా తీర ప్రాంతాలలో రోడ్లు కొట్టుకుపోయి యమకూపాలుగా మారాయన్నారు. సీఎం కొంత కాలం పాటు హెలికాప్టర్లు, విమానాలలో ప్రయాణం చేయవద్దని.. త్వరలో ప్రారంభించే రచ్చబండ కార్యక్రమానికి రోడ్డు మార్గంలో వెళ్లాలని రఘురామ సూచించారు. అలా వెళితే మీ పాలనలో రోడ్లు ఎంత బాగున్నాయో మీరే కనులారా వీక్షించవచ్చన్నారు. ప్రజలు అనుభవిస్తున్న రోడ్డు బాధలు […]
విధాత: రహదారుల వాస్తవ పరిస్థితిపై సీఎం జగన్కు ఎంపీ రఘురామ లేఖ రాశారు. మరమ్మతులు చేయని కారణంగా రహదారుల పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. కోస్తా తీర ప్రాంతాలలో రోడ్లు కొట్టుకుపోయి యమకూపాలుగా మారాయన్నారు. సీఎం కొంత కాలం పాటు హెలికాప్టర్లు, విమానాలలో ప్రయాణం చేయవద్దని.. త్వరలో ప్రారంభించే రచ్చబండ కార్యక్రమానికి రోడ్డు మార్గంలో వెళ్లాలని రఘురామ సూచించారు. అలా వెళితే మీ పాలనలో రోడ్లు ఎంత బాగున్నాయో మీరే కనులారా వీక్షించవచ్చన్నారు. ప్రజలు అనుభవిస్తున్న రోడ్డు బాధలు మీకూ అర్ధం అవుతాయన్నారు. అప్పుడైనా మీరు రహదారుల అభివృద్ధిపై శ్రద్ధ చూపుతారని రఘురామ పేర్కొన్నారు.