ప్రతిపక్షంలో ఉండి చెప్పిన పత్తిత్తు కబుర్లు, ఇచ్చిన హామీలు గుర్తులేవా..?

విధాత‌: జగన్ రెడ్డి బాదుడు, దోపిడీకి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వైకాపా పాలనలో సంక్షేమం మూరెడు…విద్యుత్ బిల్లులు బారెడు. విద్యుత్ బిల్లులు పట్టుకోకుండానే షాక్ కొట్టి దిమ్మతిరిగిపోతుంది. సర్దుబాటు ఛార్జీల పేరుతో రూ.4 వేల కోట్లు సర్దేస్తున్నారు.ప్రతిప క్షంలో ఉండి చెప్పిన పత్తిత్తు కబుర్లు, విద్యుత్ ఛార్జీలు పెంచనంటూ ఇచ్చిన హామీలు గుర్తులేవా? రెండున్నర ఏళ్ల పాలనలో ఐదు సార్లు విద్యుత్ ఛార్జీలు వడ్డించి రూ.9069 కోట్లు దోచేసారు. అమ్మా కరెంట్ బిల్లెంత! అక్కా బిల్లెంత? అని అడిగే […]

ప్రతిపక్షంలో ఉండి చెప్పిన పత్తిత్తు కబుర్లు, ఇచ్చిన హామీలు గుర్తులేవా..?

విధాత‌: జగన్ రెడ్డి బాదుడు, దోపిడీకి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వైకాపా పాలనలో సంక్షేమం మూరెడు…విద్యుత్ బిల్లులు బారెడు. విద్యుత్ బిల్లులు పట్టుకోకుండానే షాక్ కొట్టి దిమ్మతిరిగిపోతుంది. సర్దుబాటు ఛార్జీల పేరుతో రూ.4 వేల కోట్లు సర్దేస్తున్నారు.ప్రతిప క్షంలో ఉండి చెప్పిన పత్తిత్తు కబుర్లు, విద్యుత్ ఛార్జీలు పెంచనంటూ ఇచ్చిన హామీలు గుర్తులేవా? రెండున్నర ఏళ్ల పాలనలో ఐదు సార్లు విద్యుత్ ఛార్జీలు వడ్డించి రూ.9069 కోట్లు దోచేసారు. అమ్మా కరెంట్ బిల్లెంత! అక్కా బిల్లెంత? అని అడిగే దమ్ము ఇప్పుడుందా జగన్ రెడ్డి? రకరకాల పేర్లతో విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని నారా లోకేష్ వెల్ల‌డించారు.