కొబ్బరి తోటలు పెంచే రైతులకు కేంద్రం చేయూత అందిస్తుందని బీజేపీ నాయకురాలు రాణి రుద్రమ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఆమె పోస్టు చేశారు. ఏపీ ఏలూరు వేకివాడ కొబ్బరి డెవలప్మెంట్ బోర్డు, కొబ్బరి పరిశోధన కేంద్రం నుంచి రైతులు సబ్సిడీపై కొబ్బరి మొక్కలు అందిస్తున్న విషయాన్ని ఆమె ఆ వీడియోలో వివరించారు.
ఎకరానికి 60మొక్కలు చొప్పున ఒక్కో మొక్కకు రూ.350, ఎకరానికి రూ.28,000, 2.5 ఎకరాలకు రూ.56, 000 సబ్సిడీగా కేంద్రం అందిస్తుందని ఆమె వెల్లడించారు. 5ఎకరాల వరకు సబ్సిడీ పథకానికి అందిస్తారు. ఆసక్తిగల రైతులు ఈ కేంద్రాన్ని సంప్రదించి సబ్సిడీపై కొబ్బరి మొక్కలు పొందాలని రాణి రుద్రమ తెలిపారు. ప్రతి జిల్లాలోని కృషి విజ్ఞాన్ కేంద్రం హార్టీకల్చర్ అధికారుల ద్వారా రైతులు ఈ పథకానికి దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. వంద శాతం సబ్సిడీపై కొబ్బరి మొక్కలు అందించే ఈ పథకాన్ని రైతులు ఉపయోగించుకుని ప్రత్యామ్నాయ పంటలు, తోటల దిశగా కొబ్బరి తోటలు పెంచుకోవచ్చని తెలిపారు.
కొబ్బరి రైతులకు కేంద్రం చేయూత.
ఒక మొక్కకు – 350 .
ఎకరానికి – 22,400.
2.5 ఎకరాలకు – 56000 సబ్సిడీ.Central suport to coconut farmers.
PM Narendra Modi’s govt has been providing 100% subsidy for coconut plantation to support Farmers.
Central subsidy per plant – 350/-.
Per… pic.twitter.com/u49gLczQtR— Rani Rudhrama Reddy ( Modi ka parivar ) (@RaniRudrama) June 26, 2026