విధాత:చెరువులు, కాలువలు, రిజర్వాయర్లపై ఆధారపడి మత్స్యకారులు జీవిస్తున్నారు. అనేక ఆందోళనల అనంతరం ప్రభుత్వం వీటిపై సొసైటీలు ఏర్పాటు చేసి వారికి జీవనాధారం కల్పించింది. చెరువుల, రిజర్వాయర్లు వంటి నీటి వనరుల్లో చేపలు పెంచుకొనే హక్కులు మత్స్యకార సొసైటీలకే కల్పించబడ్డాయి. ఇప్పుడు మత్స్యకారుల వృత్తి జీవనాధారం కోల్పోయేలా 217 జివోలో వాటిని వేలం వేసేలా ఉత్తర్వులు ఇవ్వడం సరైందిగాదు. మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు విడుదల చేసిన 217 జివోను రద్దు చేయాలని సొసైటీల […]
విధాత:చెరువులు, కాలువలు, రిజర్వాయర్లపై ఆధారపడి మత్స్యకారులు జీవిస్తున్నారు. అనేక ఆందోళనల అనంతరం ప్రభుత్వం వీటిపై సొసైటీలు ఏర్పాటు చేసి వారికి జీవనాధారం కల్పించింది. చెరువుల, రిజర్వాయర్లు వంటి నీటి వనరుల్లో చేపలు పెంచుకొనే హక్కులు మత్స్యకార సొసైటీలకే కల్పించబడ్డాయి. ఇప్పుడు మత్స్యకారుల వృత్తి జీవనాధారం కోల్పోయేలా 217 జివోలో వాటిని వేలం వేసేలా ఉత్తర్వులు ఇవ్వడం సరైందిగాదు. మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు విడుదల చేసిన 217 జివోను రద్దు చేయాలని సొసైటీల విధానాన్ని కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుందన్నారు రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు.