విధాత : పంట పొలాల్లో పరవశించి మదన తాపంతో రెచ్చిపోయిన మూడు పాములు పరస్పరం సయ్యాటకు దిగాయి. పాముల సయ్యాటల సందడి చూసిన.. రైతులు బెదిరిపోయి అక్కడి నుంచి పరుగు అందుకున్నారు. ఈ అరుదైన ఘటన ఏపీలోని విజయనగరం జిల్లా వంగర మండలం మద్దివలస వద్ద చోటుచేసుకుంది.
సహజంగా రెండు పాముల సరసాల సయ్యాటలే కనిపిస్తుంటాయి. అయితే స్థానిక పంటపొలాల్లో మూడు పాములు ఒకేచోట పరస్పరం పెనవేసుకుంటూ సయ్యాటతో పరవశించాయి. ఈ అరుదైన దృశ్యాన్ని స్థానికి రైతులు వీడియో తీయగా.. అదికాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రతికేళిలో మునిగితేలుతున్న పాముల సయ్యాట సందడిని చూస్తున్న రైతులను పాములు గమనించడంతో రైతులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు.
విజయనగరం :
వంగర మండలం మద్దివలస వద్ద అరుదైన ఘటన..
పంటపొలాల్లో మూడు పాముల సయ్యాట..
పరుగులు తీసిన రైతులు, స్థానికులు..#snakes #tv9 #tv9telugu pic.twitter.com/oeqiSr7gh6— TV9 Telugu (@TV9Telugu) May 14, 2026
