మూడు పాముల సయ్యాట.. రైతుల పరుగో పరుగు!

పంట పొలాల్లో పరవశించి మదన తాపంతో రెచ్చిపోయిన మూడు పాములు పరస్పరం సయ్యాటకు దిగాయి. పాముల సయ్యాటల సందడి చూసిన.. రైతులు బెదిరిపోయి అక్కడి నుంచి పరుగు అందుకున్నారు.

పంట పొలాల్లో పరవశించి మదన తాపంతో రెచ్చిపోయిన మూడు పాములు పరస్పరం సయ్యాటకు దిగాయి. పాముల సయ్యాటల సందడి చూసిన.. రైతులు బెదిరిపోయి అక్కడి నుంచి పరుగు అందుకున్నారు. ఈ అరుదైన ఘటన ఏపీలోని విజయనగరం జిల్లా వంగర మండలం మద్దివలస వద్ద చోటుచేసుకుంది.

సహజంగా రెండు పాముల సరసాల సయ్యాటలే కనిపిస్తుంటాయి. అయితే స్థానిక పంటపొలాల్లో మూడు పాములు ఒకేచోట పరస్పరం పెనవేసుకుంటూ సయ్యాటతో పరవశించాయి. ఈ అరుదైన దృశ్యాన్ని స్థానికి రైతులు వీడియో తీయగా.. అదికాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రతికేళిలో మునిగితేలుతున్న పాముల సయ్యాట సందడిని చూస్తున్న రైతులను పాములు గమనించడంతో రైతులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు.

 

ఇవి కూడా చదవండి :

WhatsApp | వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఏఐ‌తో చాట్ ఇక మరింత భద్రం.. కొత్త ప్రైవసీ ఫీచర్ తీసుకొస్తున్న మెటా!
Milk Price Hike | అమూల్, మదర్ డెయిరీ పాల ధరల పెంపు.. నేటి నుంచే అమలు!

Latest News