రాష్ట్రంలో వెంకయ్య నాలుగు రోజుల పర్యటన
విధాత: భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఈ నెల 30న ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకోనున్నారు. కృష్ణా జిల్లా ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్లో 30న నిర్వహించే డాక్టర్ ఐ.వి.సుబ్బారావు రైతునేస్తం వార్షిక అవార్డుల కార్యక్రమంలో పాల్గొంటారు.31న విజయవాడ బందరు రోడ్డులో ఉన్న రామ్మోహన్ గ్రంథాలయంలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. నవంబరు 1న చినఆవుటపల్లిలోని డాక్టర్ పిన్నమనేని సిద్థార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. అదే […]

విధాత: భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఈ నెల 30న ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకోనున్నారు. కృష్ణా జిల్లా ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్లో 30న నిర్వహించే డాక్టర్ ఐ.వి.సుబ్బారావు రైతునేస్తం వార్షిక అవార్డుల కార్యక్రమంలో పాల్గొంటారు.31న విజయవాడ బందరు రోడ్డులో ఉన్న రామ్మోహన్ గ్రంథాలయంలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. నవంబరు 1న చినఆవుటపల్లిలోని డాక్టర్ పిన్నమనేని సిద్థార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. అదే రోజ సాయంత్రం ఐఐపీఏ సర్వసభ్య సమావేశానికి వర్చువల్ పద్ధతిలో హాజరవుతారు.నవంబరు 2న విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు.