ప్రపంచశ్రేణి పరిశుభ్ర బీచ్‌ల జాబితాలో విశాఖ

విధాత,విశాఖపట్నం:ప్రపంచ శ్రేణి పరిశుభ్ర బీచ్‌ల జాబితాలో విశాఖ చోటు సంపాదించింది. ‘బ్లూ ఫ్లాగ్‌’ బీచ్‌గా రుషికొండ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది.పర్యాటకానికి సరికొత్త శోభ తీసుకురావాలని భావించిన ప్రధాని మోదీ..ఆ దిశగా దేశంలోని 13 బీచ్‌లను ఎంపిక చేశారు. దీనికి సంబంధించిన ప్రాజెక్టులో అవకాశం దక్కించుకున్న రుషికొండ బీచ్‌.. మూడేళ్లలో రూ.7కోట్ల వ్యయంతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. గత నెలలో నేషనల్‌ జ్యూరీ.. రుషికొండ బీచ్‌తో పాటు మరో ఏడు బీచ్‌లను ఎంపిక చేసి వాటి వివరాలను డెన్మార్క్‌లోని […]

ప్రపంచశ్రేణి పరిశుభ్ర బీచ్‌ల జాబితాలో విశాఖ

విధాత,విశాఖపట్నం:ప్రపంచ శ్రేణి పరిశుభ్ర బీచ్‌ల జాబితాలో విశాఖ చోటు సంపాదించింది. ‘బ్లూ ఫ్లాగ్‌’ బీచ్‌గా రుషికొండ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది.పర్యాటకానికి సరికొత్త శోభ తీసుకురావాలని భావించిన ప్రధాని మోదీ..ఆ దిశగా దేశంలోని 13 బీచ్‌లను ఎంపిక చేశారు. దీనికి సంబంధించిన ప్రాజెక్టులో అవకాశం దక్కించుకున్న రుషికొండ బీచ్‌.. మూడేళ్లలో రూ.7కోట్ల వ్యయంతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.

గత నెలలో నేషనల్‌ జ్యూరీ.. రుషికొండ బీచ్‌తో పాటు మరో ఏడు బీచ్‌లను ఎంపిక చేసి వాటి వివరాలను డెన్మార్క్‌లోని పర్యావరణ అవగాహన సంస్థ ‘ఫౌండేషన్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఎడ్యుకేషన్‌’కు పంపింది. వాటిలో రుషికొండ ‘బ్లూ ఫ్లాగ్‌’ బీచ్‌గా అర్హత సాధించడం సంతోషంగా ఉందని ఏపీ టూరిజం సీఈవో తెలిపారు. బీచ్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని.. 7 నక్షత్రాల హోటల్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన చెప్పారు.

ReadMore:అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా విశాఖ