Breaking: ఢిల్లీ లిక్కర్ కేసు: మనీశ్ సోసిడియా అరెస్టు
Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో ఆదివారం కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఈ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీ మద్యం కేసులో ఆయనను దాదాపు ఎనిమిది గంటల పాటు విచారించిన అనంతరం అదుపులోకి తీసుకుంటున్నట్లు సీబీఐ ప్రకటించింది. ఆయనను అరెస్టు చేస్తున్నట్లు ఆయన కుటుంబానికి సీబీఐ సమాచారం అందించింది. 8 గంటలకు పైగా విచారణ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు […]

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో ఆదివారం కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఈ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీ మద్యం కేసులో ఆయనను దాదాపు ఎనిమిది గంటల పాటు విచారించిన అనంతరం అదుపులోకి తీసుకుంటున్నట్లు సీబీఐ ప్రకటించింది. ఆయనను అరెస్టు చేస్తున్నట్లు ఆయన కుటుంబానికి సీబీఐ సమాచారం అందించింది.
8 గంటలకు పైగా విచారణ
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. మద్యం పాలసీలో వ్యాపారులకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరిచారనే ఆరోపణల నేపథ్యంలో ఈరోజు ఆయనను సీబీఐ కేంద్ర కార్యాలయంలో విచారించింది. సుమారు 8 గంటలకు పైగా ప్రశ్నించిన అనంతరం సీబీఐ అధికారులు సిసోడియాను అరెస్టు చేశారు.
మనీశ్ సమాధానాలతో సంతృప్తి చెందని సీబీఐ అధికారులు..
విచారణ సమయంలో మద్యం పాలసీ గురించి వివిధ కోణాల్లో సీబీఐ అధికారులు సిసోడియాను ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న దినేశ్ అరోరా, ఇతర నిందితులతో గత సంబంధాలపై ఆరా తీశారు. వివిధ సందర్భాల్లో చేసిన ఫోన్ కాల్స్ గురించి అడిగినట్లు సమాచారం. అయితే మనీశ్ ఇచ్చిన సమాధానాలతో సంతృప్తి చెందని సీబీఐ అధికారులు ఆయన విచారణకు సహకరించడం లేదని, కీలక అంశాల్లో ఆయన చెప్పిన సమాధానాలకు పొంతన కుదరకపోవడంతో అరెస్టు చేసినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. ఆయన నుంచి కీలక సమాచారం సేకరించాలంటే కస్టోడియల్ విచారణ అవసరమన్నారు. సీబీఐ రేపు సిసోడియాను ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నది. మద్యం స్కాంలో సీబీఐ ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ నెల 19న మనీశ్ సోసిడియా సీబీఐ విచారణ కానీ..
వాస్తవానికి ఈ నెల 19న మనీశ్ సోసిడియా సీబీఐ విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఆయన ఢిల్లీ ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నందున వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూపకల్పనలో నిమగ్నమైనందున తనకు సమయం ఇవ్వాలని సీబీఐని కోరారు. ఆ తర్వాత ఆదివారం విచారణకు రావాలని ఆదేశించింది. ఈ క్రమంలో ఎనిమిది గంటల పాటు విచారించిన ఆయనను అదుపులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది.
అయితే, సీబీఐ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో దాఖలు చేసిన చార్జిషీట్ ఏడుగురి పేర్లను ప్రస్తావించారు. కానీ, ఇందులో మనీశ్ సిసోడియా పేరు కనిపించలేదు. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారులకు టెండర్లు కట్టబెట్టారని మనీశ్ సిసోడియాపై అభియోగాలుండగా.. ఇదే కేసులో ఈడీ, సీబీఐ 12 మందిని అరెస్ట్ చేశాయి.
సీబీఐ కేంద్ర కార్యాలయం వద్ద 144 సెక్షన్
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని విచారిస్తున్న నేపథ్యంలో సీబీఐ కేంద్ర కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధించారు. మనీశ్ సిసోడియా విచారణను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, 50 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో సంజయ్ సింగ్ సైతం ఉన్నారని పోలీసులు తెలిపారు.
సిసోడియా ట్వీట్ సంచలనం..
మరోవైపు సీబీఐ విచారణకు ముందు సిసోడియా చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. నేను నేడు సీబీఐ విచారణకు మరోసారి హాజరవుతున్నాను. విచారణకు పూర్తిగా సహకరిస్తాను. కొన్నినెలలు జైలులో ఉండాల్సి వచ్చినా నేను లెక్క చేయను. తాను భగత్ సింగ్ను అనుసరించే వ్యక్తిని అని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తనను అరెస్టు చేస్తారని మనీశ్కు ముందే అర్థమైనట్టు తెలుస్తోంది.
సిసోడియా అరెస్టుతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనూ ప్రకంపనలు
సిసోడియా అరెస్టుతో రాష్ట్ర రాజకీయాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ తన అభియోగ పత్రంలో రెండుసార్లు ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సీబీఐ దూకుడుగా ముందుకు వెళ్తుండటంతో తర్వాత ఎవరు? అనేద చర్చ జోరుగా జరుగుతున్నది.