విధాత, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో సీఎం కేసీఆర్ కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె కరోనా సోకడంతో క్వారంటైన్లో ఉన్నారు. ఈ కారణంగా ఈడీ అధికారులు నోటీసులను కుటుంబ సభ్యులకు ఇచ్చారు. కవిత పర్సనల్ ఆడిటర్ బుచ్చిబాబు ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి కల్వకుంట్ల కవితపై పలు ఆరోపణలను బీజేపీ నేతలు చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో […]
విధాత, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో సీఎం కేసీఆర్ కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె కరోనా సోకడంతో క్వారంటైన్లో ఉన్నారు. ఈ కారణంగా ఈడీ అధికారులు నోటీసులను కుటుంబ సభ్యులకు ఇచ్చారు. కవిత పర్సనల్ ఆడిటర్ బుచ్చిబాబు ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి కల్వకుంట్ల కవితపై పలు ఆరోపణలను బీజేపీ నేతలు చేస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఆమె ప్రమేయం కీలకమని.. ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కల్వకుంట్ల సన్నిహితులుగా పేరు పడిన అరుణ్ రామచంద్ర పిళ్లై, అభిషేక్ రావు, సూదిని సృజన్ రెడ్డి వంటి వారి ఇళ్లలో రెండు సార్లు సోదాలు నిర్వహించింది. తాజాగా కవితకు నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనం అవుతోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor scam) వ్యవహారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kalvakuntla Kavitha) మెడకు కాస్త గట్టిగానే చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది. గతంలో కవిత పీఏ(Kavith PA) నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. నేడు కవిత అకౌంటెంట్(Kavitha Accountant) ఇంట్లో సోదాలు నిర్వహించింది. కాగా.. నేడు కవితకు ఈడీ నోటీసులు పంపించింది. ప్రస్తుతం కరోనా సోకడంతో ఆమె క్వారంటైన్లో ఉండటంతో కవిత సహాయకులకు ఈడీ నోటీసులు అందజేసింది. ఈ కేసులో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్ సహా 43 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. అటు నెల్లూరులోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు జరుపుతోంది. ఢిల్లీ లోథీ రోడ్ లోని 95 నెం. బంగ్లాలో తనిఖీలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్ ఇందిరాపార్క్ చౌరస్థాలోని శ్రీసాయికృష్ణ రెసిడెన్సీలో సోదాలు జరుగుతున్నాయి. రాయ దుర్గంలోని జయభేరి సౌత్ బ్లాక్లో అభినయ్ రెడ్డి అనే వ్యాపారవేత్త ఇంట్లో సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. అటు తీహార్ జైలులో సత్యేంద్ర జైన్ను ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు వెళ్లారు.
సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు జరుపుతోంది. గతంలో ఓ సారి దేశవ్యాప్తంగా 30కి పైగా ప్రాంతాల్లో సోదాలు చేసిన ఈడీ… ఇప్పుడు కేవలం హైదరాబాద్లో జరిగిన వ్యవహారాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే హైదరాబాద్ సిటీలో రెండు సార్లు సోదాలు జరిపింది.
ఇప్పుడు మూడోసారి పెద్ద ఎత్తున రంగంలోకి దిగడంతో ఈ స్కాంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. గత తనిఖీల గోరంట్ల అండ్ అసోసియేట్స్ ఆడిటర్ బుచ్చిబాబు ఇంట్లోనూ సోదాలు జరగడం చర్చనీయాంశమవుతోంది.
కల్వకుంట్ల కవిత ఇప్పటికే బీజేపీ నేతలు తనపై నిరాధారణ ఆరోపణలు చేయకుండా కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. గతంలో ఢిల్లీలో సీబీఐ నమోదు చేసిన కేసులో కవిత పేరు లేదు. కానీ ఆమెపై బీజేపీ నేతలు వరుసగా విమర్శలు చేశారు.
ఈ కారణంగా ఆమె కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు ఈ కేసులో సంబంధం ఉందని.. విచారణ కోసం ఈడీ నోటీసులు జారీ చేయడంతో.. బీజేపీ నేతలు మరోసారి విమర్శలు గుప్పించే అవకాశం ఉంది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కవిత ఈడీ ముందు హాజరయ్య అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. కొంతమంది పెద్దలు ఢిల్లీలో కూర్చుని దురుద్దేశంతో మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. మీడియా తమ విలువైన సమయాన్ని నిజాలు చెప్పి టీవీ వీక్షకుల విలువైన సమయాన్ని ఆదా చేయాలని హితవు పలికారు. తనకు ఎలాంటి నోటీసులు అందలేదని ట్వట్టర్ ద్వారా స్ఫష్టం చేశారు.