Gold Rates | రెండోరోజు దిగివచ్చిన పసిడి ధర..! నేడు హైదరాబాద్‌లో ధరలు ఎలా ఉన్నాయంటే..?

Gold Rates | రెండోరోజు దిగివచ్చిన పసిడి ధర..! నేడు హైదరాబాద్‌లో ధరలు ఎలా ఉన్నాయంటే..?

Gold Rates | ఇటీవల భారీగా పెరిగిన పసిడి ధరలు ఊరటనిస్తున్నాయి. వరుసగా రెండోరోజూ బంగారం ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. బులియన్‌ మార్కెట్‌లో మంగళవారం పసిడి ధర మరోసారి తగ్గింది. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.100 తగ్గి తులానికి రూ.61,150 పలుకుతుండగా.. 24 క్యారెట్ల పసిడిపై రూ.110 తగ్గి తులానికి రూ.66,710కి చేరాయి. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.62వేలు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.67,640కి తగ్గింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.61,150 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.66,710కి దిగజారింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.61,300 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.66,860కి చేరింది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.61,150 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.66,710 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో వెండి ధర సైతం నిలకడగా కొనసాగుతున్నది. మరో వైపు వెండి సైతం దిగివచ్చాయి. రూ.300 తగ్గి కిలో వెండి రూ.77,500 ధర పలుకుతున్నది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రూ.80,500కి చేరింది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.