Gold Rates | నేడు మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నయో తెలుసా?
బంగారం ధరలు ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Gold Rates | బంగారం ధరలు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. బులియన్ మార్కెట్లో మంగళవారం ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల తులానికి రూ.58,150 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.63,440 వద్ద కొనసాగుతున్నాయి. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.58,700 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.64,040 వద్ద ట్రేడవుతున్నది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.58,150 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.63,440 వద్ద స్థిరంగా ఉన్నది.
ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.58,300 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,590 వద్ద కొనసాగుతున్నది. హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.58,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,440 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో కిలో వెండి రూ.78,300 వద్ద కొనసాగుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈక్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.