Electric Goods | ఎలక్ట్రిక్‌ వస్తువుల వారంటీ విషయంలో కంపెనీలకు కేంద్రం కీలక ఆదేశాలు..!

Electric Goods | వినియోగదారులకు ఎలక్ట్రానిక్‌ వస్తువులను కొనుగోలు చేసే సమయంలో వారంటీకి సంబంధించిన వివరాలను స్పష్టంగా తెలియజేయాల్సిందేనని కేంద్రం కంపెనీలకు స్పష్టం చేసింది. వారంటీ ప్రారంభమయ్యే సమయాన్న చెప్పాలని, వారంటీ విషయంలో ప్రపంచంలో అత్యుత్తమ ప్రమాణాలను భారత్‌లో అనుసరించాలని తయారీ కంపెనీలను ఆదేశించింది.

Electric Goods | ఎలక్ట్రిక్‌ వస్తువుల వారంటీ విషయంలో కంపెనీలకు కేంద్రం కీలక ఆదేశాలు..!

Electric Goods | వినియోగదారులకు ఎలక్ట్రానిక్‌ వస్తువులను కొనుగోలు చేసే సమయంలో వారంటీకి సంబంధించిన వివరాలను స్పష్టంగా తెలియజేయాల్సిందేనని కేంద్రం కంపెనీలకు స్పష్టం చేసింది. వారంటీ ప్రారంభమయ్యే సమయాన్న చెప్పాలని, వారంటీ విషయంలో ప్రపంచంలో అత్యుత్తమ ప్రమాణాలను భారత్‌లో అనుసరించాలని తయారీ కంపెనీలను ఆదేశించింది. వస్తువు కొనుగోలుకు ముందే వారంటీకి సంబంధించి వివరాలను తెలపాలని.. కొనుగోలు చేసిన తర్వాత కాదని పేర్కొంది.

ఈ మేరకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమైంది. కంపెనీలు రూపొందించిన విధానాల ప్రకారం.. వారంటీ వ్యవధి.. వస్తువు కొనుగోలు చేసిన తేదీ నుంచి ప్రారంభమవుతుందని, ప్రొడక్ట్ ఇన్‌స్టాలేషన్ తేదీ నుంచి కాదని సీసీపీఏ చీఫ్ కమిషనర్ నిధి ఖరే తెలిపారు. అయితే, వినియోగదారులు వస్తువుని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మాత్రమే దాన్ని ఉపయోగించడం మొదలవుతుందని, కాబట్టి వారంటీ వ్యవధిలో తేడా ఉంటుందని అన్నారు.

వస్తువులు, ఉత్పత్తులు లేదంటే సేవల నాణ్యత, పరిమాణం, పనితీరు, నాణ్యత, ప్రమాణాలు, ధరల గురించి తెలుసుకునే హక్కు వినియోగదారులకు ఉందని చెప్పారు. అన్ని కంపెనీలు తమ అభిప్రాయాలను 15 రోజుల్లోగా తెలపాలని విజ్ఞప్తి చేశారు. వారంటీ వ్యవధికి సంబంధించి వినియోగదారుల ఫిర్యాదులను సత్వరం, చురుగ్గా పరిష్కరించాలని సీసీపీఏ చీఫ్ కమిషనర్ నిధి ఖరే స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎల్‌జీ, పానాసోనిక్, హాయర్, క్రోమా, భాష్‌ కంపెనీలతోపాటు పలు ప్రధాన ఎలక్ట్రానిక్స్ వస్తువుల కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.