కొనుగోలుదారులకు రిలీఫ్.. స్వల్పంగా తగ్గిన పసడి ధరలు..! హైదరాబాద్లో ధరలు ఎలా ఉన్నాయంటే..?

విధాత: నిన్నా మొన్నటి వరకు విపరీతంగా పెరిగిన బంగారం ధరలు కొనుగోలుదారులకు స్వల్ప ఊరటనిచ్చాయి. బులియన్ మార్కెట్లో మంగళవారం ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. 22 క్యారెట్ల గోల్డ్పై రూ.310 తగ్గి తులానికి రూ.55,100 పతనమైంది. 24 క్యారెట్ల గోల్డ్పై రూ.340 తగ్గి రూ.60,110కి దిగివచ్చింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసడి రూ.55,250 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.60,260కి తగ్గింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.55,100 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.60,110 వద్ద కొనసాగుతున్నది.
చెన్నైలో చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.55,300 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.60,330కి తగ్గింది. బెంగళూరులో బెంగళూరులో 22 క్యారెట్ల స్వర్ణం రూ.55,100 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.60,110 వద్ద కొనసాగుతున్నది. ఇక హైదరాబాద్లో 22 క్యారెట్ల గోల్డ్ రూ.55,100 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.60,110 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోనే ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో కిలోకు రూ.74,100 వద్ద ట్రేడవుతున్నది. అలాగే ప్లాటినం ధరలు స్వల్పంగా పెరిగాయి. రూ.20 పెరిగి.. తులానికి రూ.23,600 పలుకుతున్నది.